'ఆస్ట్రేలియా' పెట్టుబడులకు ఏపీ అనువైనది


Ens Balu
12
Visakhapatnam
2022-07-16 12:49:55

భౌగోళికంగా, సాంకేతికంగా, వాణిజ్యపరంగా అత్యంత శక్తివంతమైన ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి  అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐ. టి  శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు చెన్నై,  బెంగుళూరు లలో  వివిధ రంగాల్లు పెట్టుబడులు. పెట్టడానికి పశ్చిమ  ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమర్  రోజర్ హగ్ కుక్  నాయకత్వంలో  వంద మంది సభ్యులతో కూడిన పచ్చిమ ఆస్ట్రేలియా బృందం శనివారం విశాఖ వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్.  ఎకనమిక్. డెవలప్మెంట్ బోర్డు,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియా  ప్రతినిధులతో శనివారం ఇక్కడ  జరిగిన సదస్సులో ఇరు దేశాల మధ్య  పలు ఒప్పందాల పై సంతకాలు జరిగాయి. పశ్చిమ ఆస్ట్రేలియా, భారత్  మధ్య వాణిజ్య సంబంధాలు ఈ  ఒప్పందాల వలన మరింత బలోపేతం. అవుతాయని  అన్నారు.

భారత్, ఆస్ట్రేలియా  దేశల మధ్య స్నేహ  సంబంధాలు అనాదిగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు జరిగే వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాలకు  మరింత ప్రయోజన కారిగా ఉంటాయని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో 
నిలిచిందని ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి  చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున పెట్టబరాలను రాష్ట్రానికి రాబట్టగలిగామని చెప్పారు.  2019-22 మధ్య 43, 866 కోట్ల యుపాయల మేర పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నా మని చెప్పారు.  2.33 లక్షల మందికి వుద్యోగాలు లభించాయి  అని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు  పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అత్యంత త్వరగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పా అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్రలో ఆరు పోర్టులు ఉన్నాయాని, మరో మూడు త్వరలోనే అందుబాటులో రానున్నాయని చెప్పాం. సముద్ర రవాణాలో

ఆంధ్రప్రదేశ్ పోర్టులు అత్యున్నత స్థానములో నిలిచాయి.   అని  అమర్ నాథ్ చెప్పారు. 2020-21లో రాష్ట్రం నుంచి 16.9 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని అదే 2020-21 లో 22.88 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశామని  తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ లో సుశిక్షుతులైన యువకులు ఉన్నారని, వివిధ రంగాల్లో  నిపుణులకు ఇక్కడ కొరత లేదని అమర్ నాథ్ చెప్పారు.  ఐటి రంగంలో  పెట్టుబడులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన భూములు సిద్ధంగా ఉన్నాయిని అయిన వెల్లడించారు. విశాఖపటం పర్యాటకంగా

అభివృద్ధి చెండిందని,  సినిమాల చిత్రికరణకు అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని, ఆస్ట్రేలియా సినీ పరిశ్రమ ఇక్కడ సినిమా చిత్రీకరణ చేసుకోడానికి ముందుకు రావాలని మంత్రి అమరనాథ్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమర్ రోజర్ హగ్  కుక్ మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు చాలా మంది శ్రమించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో.  ఫిషింగ్, ఆక్వా  కల్చర్  రంగాలు ముందంజలో  వున్నాయని అన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆ దేశాలు ఆర్ధికంగా మరింత బలోపేతం అవడానికి అవకాశం వుందని అన్నారు. విద్య, పర్యాటక రంగాలు
మరింత అభివృద్ధి చెయతాయన్నారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ గడచిన నాలుగు సంవత్సరాల  నుంచి ఆంధ్రప్రదేశ్ జి.డి.పి. రేటు వృద్ధి చెందుతూ వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఫుడ్. ప్రాససింగ్ , కెమికిల్, పెట్రో కెమికల్,  ఐటి  విద్య రంగాలు మెరుగైన ఫలితాలను సంధిస్తున్నాయిని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఏడూ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు  కోర్సులు  పూర్తి చేసి బయటకు వస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ని అనేక దేశాల్లో తెలుగు విద్యార్థులతో మినీ ఆంధ్ర ప్రదేశ్ కనిపిస్తోంది అని అన్నారు. సురరిపాలన,  కచ్చితమైన నాయకత్వం చూసి   అనేక దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయిని అన్నారు. ఈ సమావేశంలో  పశ్చిమ ఆస్ట్రేలియా  విద్యా శాఖ మంత్రి టెoపుల్టన్,  పరిశ్రమల  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.