ఇక ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు


Ens Balu
5
Guntur
2022-08-27 14:04:30

సామజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోవడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాకుండా కోర్టులపై బాధ్యతరహితంగా వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.  సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు విపరీతంగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన హైకోర్టు  కోర్టులు, న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా, ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సుమోటోగా తీసుకుంది.  నమోదైన కేసులో హైకోర్టుకు క్షమాపణలు తెలిపానని చంద్రశేఖర్ వాదనలు వినిపించారు.  తనను ప్రతివాదుల జాబిత నుంచి తొలగించినా .. సీబీఐ అరెస్ట్ చేసి పది రోజులు జైల్లో పెట్టిందన్నారు.  వాటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఆ పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.