వినాయకచవితికి ఎలాంటి ఆంక్షలు లేవు


Ens Balu
7
Guntur
2022-08-28 16:36:10

వినాయక చవితి నిమజ్జనం ఘనంగా జరుపుకోవడానికి పోలీసు శాఖ సహకరిస్తుంది..పండుగ నిర్వహణకుఎటువంటి ప్రత్యేక ఆంక్షలు విధించటం లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎప్పటిలాగే వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఎస్పీ, కమిషనర్, డీఐజీను సంప్రదించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ముందుగా సమాచారం అందించాలలన్నారు. అంతేకాకుండా ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి కూడా  తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన వివరాలు తెలియజేయాలన్నారు. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలన్నారు.

 పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనలు 2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను వినియోగం ఉండాలన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాటిని వినియోగించాలని, మండపాల వద్ద క్యూలను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ తీసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ  ప్రతినిధులు కాపలా ఉండాలని సూచించారు. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్ లకు ఆదేశాలు జారిచేసినట్టు వివరించారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు, వేషధారణలు, డీజేలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడం తప్పని సరి స్పష్టం చేశారు.