ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ కోల్పోయింది రూ.లక్షల కోట్లు


Ens Balu
14
2022-10-11 02:33:00

ఆంధ్రప్రదేశ్ విభజనలో హైదరాబాదులో ఒక్కచోటే రాజధాని ఉండటం ద్వారా కోల్పోయిన విలువైన ఆస్తులు, ప్రభుత్వకార్యాలయాలు, కర్మాగారాలు లెక్కేలేదు. ఇదంతా రాష్ట్రప్రజలు పన్నులతో నిర్మించిన రాజధానిని కేవలం విభజన ద్వారా మనకు రావాల్సిన ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల్లో మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. విభజన జరిగిన 13ఏళ్లకు గానీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా హైదరాబాదు నుంచి తెచ్చుకోలేకపోయామంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రాల అభివ్రుద్ధిలో వికేంద్రీకరణ ప్రముఖ పాత్రపోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రం విడిపోయిన తరువాత కానీ తెలిసిరాలేదు. అలాగని కేంద్రం కూడా ఏపీని ఆదుకోవడంలో ముందుకు వచ్చిందా అంటే అదీ లేదు. కేవలం నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. నేటికీ విభజన హామీలు పూర్తికాలేదంటే అతిశయోక్తికాదేమో. ఒకేచోట రాజధాని ఉండాలనుకునే రాజకీయపార్టీలు, ఒక వర్గం ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటే ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒప్పుకొని తీరాలి కూడా. అంత విలువైన సంపదను, భవిష్యత్లును ఏక రాజధాని వలన ఏపీ కోల్పోయిందనే విషయాన్ని ముందుగా యువత గుర్తించాల్సి వుంది.

ఏపీ రాజధాని కోల్పోయిన ఆస్తులు రూ. వేల కోట్లలోనే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుగా విడిపోయిన తరువాత మనం, మన రాష్ట్రం కోల్పోయింది అసెంబ్లీ, శాసనమండలి, హైదరాబాద్ రైల్వేజోన్, ఆయుర్వేద ఫార్మసీ, యునానీ ఫార్మసీ, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంధ్రభారతి, అసెంబ్లీ క్వార్టర్స్, సచివాలయ భవన సముదాయం, సాలర్జంగ్ మ్యూజియం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. రాజధాని హైదరాబాదు కేంద్రంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ విభజనలో ఏమీకాకుండా కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అలాగని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా కేంద్రం విభజనలో ఇప్పటి వరకూ ఏపీకి కేటాయించలేదు. నిర్మించలేదు. నేటికీ తెలంగాణకి విభజన తరువాత మిగిలిన లక్షల కోట్ల ఆస్తుల్లో ఏపీ నేటికీ ఏమీ సమకూర్చుకోలేకపోయింది. దానికి కారణం రాజధాని లేకపోవడం, ఒకేచోట రాజధాని ఏర్పాటు చేయాలనే పట్టుదల ఉండటం. అదే సమయంలో రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే ఆలోపాలన్నీ పెద్ద గ్రంధమే అవుతుంది.

ఏక రాజధాని వద్దు..మూడు రాజధానులే ముద్దు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత జరిగిన తీవ్రమైన నష్టాన్ని ఏకరాజధానిగా అనుకున్న అమరావతి ద్వారా కూడా గత ప్రభుత్వం ద్వారా మనం పూడ్చుకోలేకపోయాం. అంతేకాకుండా విభజన ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన సంస్థలు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సదుపాయాలు, ఆర్ధిక సహాయం కూడా పూర్తిస్థాయిలో రాకుండా పోయాయి. రాష్ట్రవిభజన జరిగిన తరువాత కేంద్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే విశాఖలాంటి రైల్వే డివిజన్ ను సైతం కేంద్రం నేటికీ రైల్వే జోన్ గా ప్రకటించలేదు. ఉమ్మడి రాజధానిగా ఉండటం వలనే హైదరాబాదు సాఫ్ట్ వేర్ హబ్ గా అవతరించింది. హైటెక్ సిటీలాంటి సంస్థలు నిర్మాణాలు జరిగాయి. ఇపుడు ఆ పరిస్థితి ఏపీలో కూడా రావాలంటే ఒకేచోట రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాదని, దానిని వికేంద్రీకరణ చేయడం ద్వారానే వస్తుందని ప్రభుత్వం బలంగా నమ్మి దానిని చట్టం రూపంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది. దానిని ఒక వర్గం ప్రజలు వ్యతిరేకించినా..అత్యధికశాతం ప్రజలు స్వాగతిస్తున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాజధాని మాత్రమే ఉండటం ద్వారా ఏమోం కోల్పోయామో అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని అన్ని వర్గాల ప్రజలు కూడా అభివ్రుద్ది వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారు.

మూడూ రాజధానులతో ఒకేసారి అభివ్రుద్ధి ప్రారంభం ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోశాసన రాజధాని, కర్నూలో న్యాయరాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుచేయాలనే ఆలోచనతో చేస్తున్న కార్యాచరణకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తున్నది. ఫలితంగా మూడు ప్రాంతాల్లో ఒకేసారి అభివ్రుద్ధి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా అన్నివర్గాల ప్రజలకు విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఏర్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక వర్గం ఆందోళనతో ఇపుడు మూడు రాజధానుల విషయాన్ని రాజకీయం చేయాలని చూసినా మెజార్టీప్రజలు మూడు రాజధానులు కోరుకోవడం ద్వారా అంతా ఆలోచించే పరిస్థితి నెలకొంది. మూడు రాజధానులు ఏర్పాటు అయితే అటు కేంద్రం నుంచి రావాల్సిన కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా మూడు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయడానికి, రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుంది. ఏపీలో సాఫ్ట్ వేర్ రంగాన్ని బోలోపేతం చేయాలన్నా, న్యాయవిభాగాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేర్చాలన్నా, పరిపాలనను వికేంద్రకరించాలన్నా, అభివ్రుద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నా.. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటు అత్యంత ముఖ్యమని అంతా భావించాలి. ఒక రాజకీయ పార్టీ, ఒక వర్గం రాజకీయానికి రాష్ట్రాభివ్రుద్ధి విఘాతం అయితే దానిని ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ తిప్పికొట్టాల్సిన సమయం ఆశన్నమైంది. తద్వారా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేసే ప్రక్రియలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి..మూడు రాజధానులతోనే నిజమైన అభివ్రుద్ధి, మూడు ప్రాంతాలకు ఆత్మగౌరవం దక్కుతుందని గమనించాలి..!