తూచ్.. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో మళ్లీ ఇంటర్వ్యూలు


Ens Balu
23
Tadepalli
2023-01-01 04:20:57

ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే గ్రూప్-1, 2 పోటీపరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి మడమ తప్పింది. ప్రస్తుతం తీయబోయే గ్రూప్-1 పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన తరువాత ఇంటర్వ్యూలు పెట్టి పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తీస్తున్న 92 గ్రూప్-1 పోస్టులకు గతంలో భర్తీకాని 18 గ్రూప్-1 పోస్టులు కలిపే అవకాశం కూడా ఉందన్నారు. దానికి పాలనా పరమైన అనుమతులు రావాల్సి వుంటుందన్నారు. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తయితే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్-1, 2, పోస్టులకు ఇంటర్వ్యూలు తీసేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ ఇంటర్వ్యూలు పెట్టడం విశేషం.