గ్రామ, వార్డు సచివాలయాలను మరింతగా ఆధునీకరించి ప్రజలకు సేవలు అందించడంతో అగ్రగామిగా నిలవా లని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సచివాలయ వ్యవ స్థపై సమీక్ష నిర్వహించిన ఆయన సిబ్బంది విధులపై ఆయాప్రభుత్వశాఖలు ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీ జర్) ఏర్పాటుచేయాలన్నారు. అన్ని సచివాలయాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నారు. సచివాల యాల్లోని ప్రభుత్వ శాఖాధిపతులు నెలలో రెండుసార్లు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నారు.