ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోనే అందుబాటులోకి వచ్చిన ఫేషియల్ బయోమెట్రిక్ హాజరు గ్రామసచివాలయాలకు వర్తింపచేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెప్పారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్సు నడుస్తుండగా సంక్రాంతి దాటిన తరువాత నెలాఖరులోపుగా దానిని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాలు చెప్పి బయటకి వెళ్లిపోయే జంపింగ్ లకు కళ్లెం పడనుంది. అంతేకాకుండా ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు.