సిమ్ కార్డులు ఇవ్వకముందే మూలకి చేసిన మొబైల్స్


Ens Balu
25
తాడేపల్లి
2023-01-05 03:49:31

ఏపీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వింతపరిస్థితి చోటుచేసుకుంది. ఇక్కడ పనిచేసే సచివాలయ మహిళా పోలీసులుకు ప్రభుత్వం సెల్ ఫోన్లు ఇచ్చింది గానీ, అందులో వినియోగించడానికి సిమ్ కార్డు(ప్రభుత్వ నెట్వర్క్ కలిగిన)లు ఇవ్వలేదు. ఈఫోన్లు ఇచ్చి ఏడాది గడిచింది. అపుడే ఆఫోన్లు మూలకు చేరిపోతున్నాయి. కొన్ని ఫోన్లు బ్యాటరీలు పాడైపోయి చార్జింగ్ నిలబడటం లేదు. ప్రభుత్వం సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులే తమ సొంతఖర్చుతో ప్రైవేటు నెంబర్లు వేసుకొని ఆఫోన్లను వాడాల్సి వస్తుంది. ఈవిషయాన్ని పోలీసుశాఖ వద్ద ప్రస్తావిస్తే..త్వరలోనే సిమ్ కార్డులు ఇస్తాం అనిచెబుతూనే వస్తున్నారు ఏడాది నుంచి..!