వైయస్ జగన్ అధ్యక్షతన చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం -6వ విడత జగనన్న తోడు, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్లు కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కార్యక్రమం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్, ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి అదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ఇతరశాఖల ముఖ్య కార్యదర్శిలు కూడా పాల్గొన్నారు.