గ్రామపంచాయతీల్లో ఆగస్టు15 నుంచి డిజిటల్ చెల్లింపులు


Ens Balu
104
Tadepalli
2023-07-27 01:40:58

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 12940 గ్రామ పంచాయతీల్లోని, 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 15నుంచి డిజిటల్ చెల్లింపులు చేపట్టేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో యూపిఐ, డిజిటల్ పేమెంట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంతో ఏపీలో కూడా దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధమవుతున్నది.కాగా ఏపీలో13 జిల్లాలు 26జిల్లాలు అయినా.. ప్రస్తుతానికి కేంద్రం ద్రుష్టిలో మాత్రం నేటికీ 13 జిల్లాలుగానే ఉన్నాయి. ఇక డా.వైఎస్సార్ కడప జిల్లాలో-800 గ్రామ పంచాయతీలు, పశ్చిమగోదావరి-888, విజయనగరం- 929, విశాఖపట్నం- 944, శ్రీకాకుళం-1101, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు-961,ప్రకాశం-1036, కర్నూలు-899, క్రిష్ణ-972, గుంటూరు-1016, తూర్పుగోదావరి-1012, చిత్తూరు జిల్లాలో-1381 పంచాయతీల్లో డిజిటల్ పేమెంట్లు చేసేలా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లుచేసింది.