గ్రామ, వార్డు సచివాలయశాఖలో మరణ మృదంగం..!


Ens Balu
287
Amaravathi
2023-08-21 15:14:58

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులు ఉసురు అర్ధాంతరంగానే ముగిసి పోతున్నది. ఒకటి కాదు 2కాదు ఏకంగా 125 మంది ఉద్యోగులు ఒక్క విద్యుత్ విభాగం విధినిర్వహణలో మృత్యువాత పడటంతోపాటు,  మరో 250 మంది శాస్వతంగా అంగవైక ల్యాని కి గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరిగినా సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి ప్రాణ భద్రత లేకుండా పో తుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాల్లో ఒక్క ఎనర్జీ అసిస్టెంట్ కి నేటి వరకూ సేఫ్టీ పరికరాలుగానీ, పనిముట్లు గానీ ప్రభుత్వం పంపిణీ చేయలే దు. పైగా తమ పరిధిలోకి రాని 11కెవి, 33కెవి విద్యుత్ ఫోల్స్ పై పనులు చేయిస్తున్నారని వాపోతున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహా రం ఇవ్వకపోగా కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలివ్వకపోవడం విశేషం..!