ఏపీలో నేడే విడుదల..!


Ens Balu
57
visakhapatnam
2024-06-03 11:59:54

ఐదేళ్ల సంక్షేమం..ఐదేళేళ్ల సంక్షోభం..ఐదేళ్ల  ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలు.. ఐదేళ్లు నిరుద్యోగుల వయస్సు పెంచేసిన జాబ్ క్యాలెండర్ లేని హామీలు..ఐదేళ్ల ప్రతిపక్షాల నిరీక్షణకు నేడు ఓటు వేసిన ఓటు..బుల్లిపెట్టెలో దాగున్న గుట్టు బయట పడునుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని ఓటింగ్ పర్శంటేజీ ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడితే..అదే ఓటింగ్ రెండు రాజకీయపార్టీల మధ్య బలబలాలను కూడా ప్రదర్శించుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. ఎన్నికల సంఘం చైతన్య కార్యక్రమాలతో భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీని అధికార పీఠం ఎక్కిస్తుంది. మరేపార్టీని ప్రతిపక్షంలోకి నెట్టేస్తుందనేది తేలిపోతుంది. ఎన్నడూలేనివిధంగా అత్యధిక శాతం పోలైన పోస్టల్ బ్యాలెట్ పొలికేకతో ప్రారంభమయ్యే మెజార్టీ ఏపార్టీకి దన్నుగా నిలుస్తుందో కూడా రుజువైపోతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొత్తగా చేరిన 10.38 లక్షల కొత్త ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో కూడా ఫలితాల్లో వచ్చేస్తాయి. పరిపాలన ప్రతిభింబించే ఫలితాలు వచ్చే ఈరోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిలుచున్న అభ్యర్ధుల జాతకాలేంటో కూడా తేలిపోనున్నాయి. ప్రజలు మెచ్చిన నిజమైన ప్రజాప్రతినిధి ఎవరు, ప్రజలు తిరస్కరించిన ప్రజాప్రతినిధి ఎవరు..? ఏ పార్టీ వైపు ప్రజలు దన్నుగా నిలుచున్నారో కూడా స్పష్టమైన మెజార్టీతో లెక్కలొచ్చేస్తాయి.

 ఎన్నడూ లేనివిధంగా సారి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ముందు లెక్కిస్తారు గనుక అక్కడి నుంచే ప్రధాన పార్టీల మెజార్టీ కూడా లెక్కలోకి వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ నిర్వహించిన 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్ధులతోపాటు ఓటర్లు కూడా ఎంతో ఆశక్తిగా వేచి చూసిన సమయం రానే వచ్చింది. ఉదయం 8 గంటలతో ప్రారంభంమయ్యే కౌంటింగ్ మధ్యాహ్నాం నాటికి మెజార్టీ సాయంత్రం నాటికి ఓ మోస్తరు ఫలితాలు..సరాసరి రాత్రి 10 నుంచి 11 మధ్య పూర్తి ఫలితాలు వచ్చేస్తాయి. దానికోసం ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాటు కూడా చేసింది. భారీ బంధో బస్తు, సిబ్బంది మధ్య ఓటర్లు నొక్కి ఈవీఎం బాక్సులను ఒక్కొక్కటీ తెరుస్తుంటే అపుడు వచ్చే టెన్షన్ మాట్లో చెప్పలేం. అధికారంలో ఉండగా పూర్తిస్థాయిలో చేసిన సంక్షేమం, వారి ప్రాంతాల్లో ప్రజలకు చేయూతగా నిలిచిన తోడు.. బలం ఎక్కువగా ఉందని తలకెక్కిన గర్వం.. బెదిరించిన బెదిరింపులు.. కక్షగట్టిన విధానాలు అన్నీ ఆ క్షణంలో ఏమీ కనిపించవు. కేవలం గెలుపా.. ఓటమా ఈ రెండు అంశాలు మాత్రమే అభ్యర్ధులకి కనిపిస్తాయి. ఒక్కో రౌండ్ పూర్తవుతున్నకొద్ది అభ్యర్ధులు ఈ ఐదేళ్లలో తాము ఏం చేశామో అన్నీ గుర్తుకి వచ్చేస్తుంటాయి. ఎంత చేసినా ఎన్నికల సమయంలో ఓటుకి నోటు ఎంతిచ్చారో అదికూడా ఫలితాల్లో కనిపించేస్తుంది. 

 ఏ వ్యక్తికైనా అవకాశం ఇచ్చేది సార్వత్రిక ఎన్నికలు మాత్రమే. ఆ ఎన్నికలో ఓటరు వార్ వన్ సైడ్ చేయాలనుకుంటే అనుకున్న పార్టీని గద్దె దించేస్తాడు.. లేదా ఇచ్చిన మాట.. చెప్పిన హామీ అమలు చేస్తే మరోసారి పీఠం ఎక్కిస్తాడు. ప్రస్తుత కాలంలో ఓటరు చైతన్యం కావడానికి సోషల్ మీడియా కూడా ఎంతో ఉపయోపడింది. ఈ సార్వత్రిక ఎన్నికలో డబ్బు, సంక్షేమం, అభివృద్ధి ఎంత ప్రభావం చూపించాయో అన్నింటికంటే ఎక్కువగా సోషల్ మీడియా కూడా ప్రభావం గట్టిగా చూపించడంతో దాని ఫలితం కూడా నేడు వచ్చే ఫలితాలకు తోడవనుంది. ముఖ్యంగా కొత్తగా చేరిన యువత ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, మందుబాబులు, వ్యాపారస్తులు,  ఉద్యోగులు, జర్నలిస్టులు ఇలా ఐదు వర్గాల ఓట్లు యొక్క సత్తా కూడా పార్టీల అభ్యర్ధులకు వచ్చే ఓట్ల ఫలితాలను ప్రకటించడంతో కీలకంగా వ్యవహరించనున్నాయి. అంతేకాదు ఓటరు ప్రభుత్వంపై గానీ, రాజకీయపార్టీలపై గానీ చిరాకు తెచ్చుకుంటే దాని ఫలితం కూడా నోటా రూపంలో బయటకు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల ఫలితాల్లో నోటాకి కూడా ఓట్లు అధికంగానే పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. పక్కగా పడతాయనుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లుకూడా ఎవరికి పడ్డాయో తెలియక కొట్టిమిట్టాడుతున్న పార్టీలకు నేటితో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా. ప్రజలు మెచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలకి చేరువగా మంచి పరిపాలన అందిస్తే మళ్లీ మళ్లీ అదే ప్రజాప్రతినిధికి ప్రజల మద్దతు లభిస్తుంది. అలెక్కలన్నీ ఈరోజు రాత్రిలోపు అందరు అభ్యర్ధుల రాజకీయ జాతకం చెప్పే ఈవీఎం బాక్సు చెప్పేస్తుంది. ఏం జరుగుతుందనే మనమూ వేచిచూద్దాం గెలుపెవరిదో..!