చిన్న పత్రికల ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాం.. సమాచారశాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా హామీ


Ens Balu
37
visakhapatnam
2024-10-24 16:11:43

రాష్ట్రంలో చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంసు శుక్లా హామీ ఇచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(రి.నెం.312/2024)ప్రతినిధి బృందం ఆయనతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పలు సమస్యలతో  కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఎంప్యానల్డ్  దిన పత్రికలకు  రెగ్యులర్ గా యాడ్స్ రేటు కార్డు ప్రకారం విడుదల చేయాలని,  రేటు కార్డు పెంచాలని కోరారు.  పెండింగ్ లో ఉన్న చిన్న దినపత్రికలకు ఎంప్యానల్ మెంట్  ప్రక్రియను పూర్తి చేయాలని,కొత్తగా దరఖాస్తు చేసు కోవడానికి అవకాశం కల్పించాలని  ఆయనను కోరారు.  వార, పక్ష, మాస  పత్రికలకు యాడ్స్ విడుదల చేయాలని కోరారు. స్థానిక దినప త్రికలకు పిరియాడికల్స్  కు అక్రిడేషన్లు పెంచాలని జీ ఎస్ టీ,  ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.  

 పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్  ఎంప్యానల్డ్  దిన పత్రికలకు సమాచార శాఖ యధావిధిగా యాడ్స్ విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. అక్రిడేషన్లు పెంచుతామని తెలిపారు.పెండింగ్ లో ఉన్న  ఎంప్యానల్ మెంట్ పైళ్లను క్లియర్ చేయాలని , కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూదన పాల్గొన్నారు. సమాచారశాఖ డైరెక్టర్ తో  చర్చించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  పి. సత్య నారాయణ, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్ కుమార్,ఎన్.కోటే శ్వరావు, కార్యదర్శి మల్లెల శ్రీనివాసరావు, కార్యనిర్వహక కార్యదర్శి టి. మారుతీ రావు, చెవుల రంగారావుతో పాటు పలు పత్రికల ఎడిటర్లు ఉన్నారు.
సిఫార్సు