కూటమిలో అధికారుల కంత్రీ పనులు.. వార్డు సచివాలయ ఉద్యోగుల కౌన్సిలింగ్ లో రచ్చ..?!


Ens Balu
86
visakhapatnam
2025-06-28 18:48:32

గ్రామ, వార్డుు సచివాలయ శాఖ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టాలని చేస్తున్నారో లేక.. కూటమి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల ద్వారా తిరుగుబాటు రావాలని  అధికారులు చేస్తున్నారో తెలీదుగానీ.. సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో కొత్త రకం విధానాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు. బదిలీల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోమని చెప్పి.. మూడు ఆప్షన్లు ఇచ్చి వెళ్లిపోమనడంతో.. మెరిట్ లిస్టులు పెట్టకుండా రూల్ పొజిషన్ పాటించకుండా బదిలీలు చేయడం ఏంటని వార్డు సచివాలయ ఎమినిటీస్ ఎదురు తిరగడంతో చేసేది ఏం లేక.. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పి బదిలీలు చేసే అధికారులు చెప్పుకొచ్చారు., కావాలని ప్రభుత్వం, అధికారులు సచివాలయ ఉద్యోగులకు నష్టం వాటిల్లే చేస్తున్నారంటూ అధికారులను నిలదీసిన ఉద్యోగులు విశాఖలో బాయ్ కట్ చేసి.. జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదుచేశారు.. ఒక్క విశాఖలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల బదిలీలు నిలిచిపోయాయి..!

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం అంతా తిరకాసుగా చూస్తుందనే విషయం మారోమారు బదిలీల విషయంలో బయట పడింది. వాస్తవానికి ఉద్యోగులకు బదిలీలు చేయాల్సి వస్తే.. ఉద్యోగుల నియామకం సమయంలో వచ్చిన మార్కులు అధారంగా చేసిన మెరిట్ లిస్టుని బదిలీలు జరిగే టపుడు ఆన్ లైన్ చూపిస్తారు. సదరు ఖాళీలను ఉద్యోగులు వారి మెరిట్ లిస్టు ఆధారంగా ప్రదేశాలు ఎంచుకొని జాయిన్ అవుతారు. కానీ కూటమి ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా బదిలీలు ఆన్ లైన్ లో చేసుకోమని చెప్పి.. తీరా బదిలీలు జరిగే ప్రదేశానికి వెళ్లిన ఉద్యోగులకు అక్కడి అధికారులు తేడా వ్యవహారం చూసి కళ్లు బైర్లు కమ్మాయి.. ఒకఫారం ఇచ్చి అందులో మూడు ప్రదేశాలు ఎంచుకొని సంతకం చేసి ఇచ్చి వెళ్లిపోయి.. మూడు రోజుల తరువాత వస్తే మీకు బదిలీలు జరిగిపోతాయని చెప్పడంతో ఉద్యోగులంతా అధికారులపై తిరగబడ్డారు. 

తామేమీ చిన్నపిల్లలం కాదాని.. బదిలీలకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా మెరిట్ లిస్టు అంటూ ఉంటుందని.. దాని ప్రకారం చేయాలి తప్పితే మీకు నచ్చినట్టు చేయడం ఏంటని అధికారులను పట్టుకొని దులిపేశారు. ఆ మాటలను వీడియోలు తీసి 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులకు పంపడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెగ వైరల్ చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా విశాఖతోపాటు చాలా చోట్ల బదిలీలను సచివాలయ ఉద్యోగులు బాయ్ కట్ చేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమకు జరిగిన అన్యాయంపై మెమోరాండం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రభుత్వం తామంతట తామే ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయే విధంగా వ్యవహరిస్తుందని.. దానికోసమే మునుపెన్నడూ లేనివిధంగా తేడా బదిలీలు జరుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పరిపాలన వస్తే తమ బ్రతుకులు మారతాయనుకుంటే.. గత ప్రభుత్వం కంటే పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. 

బదిలీలకంటే ముందు రేషనలైజేషన్ పేరుతో వార్డుల్లో 8 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని కొన్ని పోస్టులు రద్దు చేశారని. వారిని ఖాళీలున్న సచివాలయాల్లో నియమించకుండా.. వారిని గాల్లోనే పెట్టి ఇపుడు సాధారణ బదిలీలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్న బదిలీలు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్నారని దీనిపై డిఎస్సీ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ కలుగజేసుకుంటే తప్పా, బదిలీల్లో జరుగుతున్న తేడా విధానానికి తెరపడేలా లేదని చెప్పుకొచ్చారు. అయితే జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఏమీ చేయడానికి లేదు. ఇప్పటికే క్లస్టర్ విధానం కోసం జీఓలు వచ్చిన తరువాత రెండు సచివాలయాలు కలిపి ఒక సచివాలయ చేస్తూ.. రెండు సచివాలయాల్లోని సిబ్బందిని ఒక సచివాలయానికి మాత్రమే 8 మంది ఉండేలా చేసి కొందరు ఉద్యోగులను గాల్లో పెట్టారని కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వివరించారు ఉద్యోగులు. 

అంతేకాదు ఈ తేడా విధానంపై మీడియాలో పెద్ద ఎత్తు కథనాలు కూడా వెలువడ్డాయి. దానిపై స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. ఇపుడు తీరా సాధారణ బదిలీల్లో కూడా మెరిట్ లిస్టు లేకుండా చేపడుతున్న విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకించడం, అధికారులు తేడాగా చేపడుతున్న బదిలీలను వీడియోలు తీసి మరీ వైరల్ చేయడంతో ప్రభుత్వం బదిలీల్లో చేస్తున్న తిరకాసు విధానం అందరికీ తెలిసింది. అందునా సచివాలయ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15.4 గ్రామ,వార్డు సచివాలయాల్లో సుమారు 1.30 లక్షల మంది ఉండటంతో విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని అటు అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కి, మీడియాకి  తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది. 

బహుసా సచివాలయశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి నిర్ధిష్ట ఆదేశాలు, మెరిట్ లిస్టులపై సూచనలు వస్తే తప్పా... ఉద్యోగులు బదిలీల కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు.  ఇతర శాఖల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిన ఉద్యోగుల ఖాళీలను సచివాలయ ఉద్యోగులతో భర్తీచేయడం కోసం ఉద్యోగులను కుదించి.. వారిని వేరే ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడానికి చేపట్టిన క్లస్టర్ విధానం, ఆ పై మెరిట్ లిస్టు లేకుండా జరుగుతున్న బదిలీల ప్రక్రియ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే చాలా దూరాన్ని పెంచేసింది. దీని ప్రభావం రానున్న రోజుల్లో పరిపాలనపై చాలా దారుణంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రేదేశ్ లో మాత్రమే ఒక ప్రభుత్వ శాఖకు చట్టబద్దత లేకుండా, నిర్ధిష్టమై శాఖ లేకుండా, క్యాడర్ లేకుండా సర్వీసు నిబంధనలు , ప్రమోషన్ ఛానల్ లేకుండా నడుస్తున్న ఏకైన శాఖ గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే. 

ఇప్పటి వరకూ ఆన్ని విషయాల్లో  ఉద్యోగులనుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇపుడు మెరిట్ లిస్టు లేకుండా అడ్డదారిలో వారికి కావాల్సిన వారికోసమే అన్నట్టు గా చేస్తున్న బదిలీల వ్యవహారంలో  చేస్తున్న పనులు మరింతగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అంటే వ్యతిరేక కలిగేలా చేశాయి. ఇంత జరుగుతున్నా సచివాలయశాఖను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కిమ్మనడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తేడా విధానాల కంటే కూటమి ప్రభుత్వంలో మరింత తేడాగా వ్యవహరిస్తున్నారు అధికారులు.. ఈనేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఏం క్లారిటీ  ఇస్తందనేది ఆశక్తి కరంగా మారింది..?!