ప్రశాంతంగా ప్రారంభమైన సివిల్స్ పరీక్ష..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
Amaravati
                            2020-10-04 10:13:48
                        
                     
                    
                 
                
                    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యుపీఎస్సీ సివిల్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. పరీక్షలు జరిగే విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, విజయ వాడ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల సమక్షంలో పరీక్షా పత్రాలు కేంద్రాలకు చేరుకున్నాయి. అభ్యర్ధులంతా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సారి పరీక్షలకు అభ్యర్ధుల సౌకర్యార్ధాం తిరుపతిలో హాల్ టిక్కెట్టు వారీగా ఏ కేంద్రంలో ఎవరు పరీక్షాలు రాస్తున్నారోననే సమాచారం కూడా ఇవ్వడంలో అభ్యర్ధులకు ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి మార్గం సులవు అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్ధులను లోనికి అనుమతించలేదు. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో పెట్టుకొని ప్రతీ అభ్యర్ధిని పరీక్షా కేంద్రాల వద్దే శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించిన తరువాత మాత్రమే లోనికి అనుమతించారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్యసిబ్బందితోపాటు మందులు, మంచినీరు అన్నింటిని ఏర్పాటు చేశారు.