అయ్యన్నా ఖబడ్దార్.. మంత్రి గుమ్మనూరు
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 3
                            
                         
                        
                            
Velagapudi
                            2020-10-06 20:37:10
                        
                     
                    
                 
                
                    అయ్యన్న ఖబడ్దార్ అంటూ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు..ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా బీసీ మంత్రి అయిన నాపైన అభాండరాలు వేయటం క్షమించరాని నేరం. గతంలో బెంజ్ మినిస్టర్ అన్నారు. కనీసం బెంజ్ కారులో ఒక చక్రం కూడా నాదని టీడీపీ నేతలు నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. య్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్ని మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రంగా ఖండించారు. మీడియా ముందుకు వచ్చి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తే పరువునష్టం కేసు వేస్తానని హెచ్చరించారు. తాను కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారో పూర్తిగా తెల్సుకొని టీడీపీ నేతలు మాట్లాడాలన్నారు. ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నాయుడు జైల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రుడు తదితరులు నాపైన విమర్శలు చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడటకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి జయరాం హెచ్చరించారు..