కలెక్టర్లూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి..


Ens Balu
2
Velagapudi
2020-11-18 17:25:48

కరోనా వైరస్ పట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ వస్తున్నందున అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్యఆరోగ్యశాఖ ద్వారా ఎప్పటి కప్పుడు కరోనా పరీక్షలు చేయడంతోపాటు, వారికి పూర్తిస్థాయిలో మందులు కూడా పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే యూరప్, అమెరికా లాంటి దేశాలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డిల్లీలో మరోసారి లాక్ డౌన్ చేయాలని యోచిస్తుందని ఇలాంటి తరుణంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6890 మంది కరోనా వైరస్ వలన మ్రుత్యువాత పడిన విషయాన్ని ప్రతీఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. వైరస్ నియంత్రణలో ప్రజలకు భాగస్వాములను చేయాలన్నారు. లేదంటే వైరస్ కేసులు పెరిగే అవకాశం వుందని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు.