మెడికల్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు కావడం లేదంటే..
Ens Balu
2
Tadepalle
2020-11-19 12:36:26
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ (అన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ లు, ఎక్స్ రేలు) సెంటర్లు తీసే కేంద్రాలు జిల్లా ఆసుపత్రుల్లో అరకొరగా ప్రభుత్వం మంజూరు చేయడంపై ప్రభుత్వ అధికారుల తప్పిదమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని వెనుక సాంకేతిక కారణాలు తెలుసుకుంటే కావాలనే ప్రభుత్వ పెద్దల ప్రైవేటు ఆసుపత్రులకు హెల్త్ బిజినెస్ పడిపోతుందని ప్రభుత్వ పరంగా మెడికల్ సెంటర్లపై ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచిండంలేదనే విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులకు, వివిధ జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న విభాగాల అధిపతులకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ఐవీఎఫ్ సెంటర్లు, డయాగ్నస్ కేంద్రాలు ఉన్నాయి. వారి దగ్గర లేని సదుపాయాల కోసం ప్రైవేటు మెడికల్ సెంటర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి మెడికల్ సెంటర్లు జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తే వారి హెల్త్ బిజినెస్ పూర్తిగా పడిపోతుంది. దానికోసం ప్రభుత్వం ఎప్పుడు వైద్యఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసినా పారామెడికల్ సిబ్బంది లోటును మాత్రమే అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఏడాది క్రితం విశాఖలో జరిగి రాష్ట్రస్థాయి వైద్యసమావేశంలో కూడా ఒక్క జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగానీ, ఏరియా ఆసుపత్రి వైద్యులు కాగీ ఆసుపత్రుల్లోకి కావాల్సిన స్కానింగ్ మిషన్లు, మెడికల్ ఎనలైజర్లు, ఇతర మెడికల్ సెంటర్ మిషన్ల ప్రస్తావన తేలేదు. కారణం ఒక్కటే సాధారణ రక్తపరీక్షలు కూడా పీహెచ్సీల స్థాయిలో పూర్తిగా జరగడం లేదు. అలా జరిగితే వారు పనిచేసే ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ సెంటర్ల బిజినెస్ దెబ్బతింటుంది. దానితో అన్నిజిల్లా ఆసుపత్రుల వైద్యులు కూడా సేవలు అందించడానికి సిబ్బందిని మాత్రమే అడిగి ఊరుకుంటున్నారు. కొన్నిమెడికల్ యంత్రాలు కొందరు సిఎస్ఆర్ ఫండ్స్ తో సమకూరుస్తున్నా వాటిని సాధారణ ప్రజల వైద్యానికి మాత్రం వినియోగించడం లేదు. ఉన్న సర్వీసులను సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ సెంటర్లకు పరీక్షల కోసం ప్రతిపాదించని వైద్యులు, మెడికల్ ఎక్విప్ మెంట్ కోసం ఎందుకు అడగటం లేదనే విషయాన్ని ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఏ ఒక్క ప్రభుత్వంలోనూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు గుర్తించడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా అసలు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలకు ఏస్థాయిలో మెడికల్ సెంటర్లు అవసరం అవుతాయనే విషయంలో ఒక్కసారి కూడా విచారణ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ సెంటర్ల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తే ...ప్రభుత్వం చెప్పిన కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతంది. లేదంటే ప్రచారం తప్పా ఆచరణలో ఎలాంటి ఫలితాలు కనిపించవు మరో 100ఏళ్లు దాటినా..