24న చిత్తూరులోజిల్లాలో రాష్ట్రపతి పర్యటన..
Ens Balu
1
తిరుమల
2020-11-19 16:28:36
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం ఈ నెల 24న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. గురువారంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన ఉదయం 9.45 గం. లకు చెన్నై ఎయిర్పోర్టు నుండి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలు దేరి ఉ. 10.30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మ.12.15 గం. లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారన్నారు. అనంతరం మ. 12.50 గం. లకు వరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి దర్శనానికి బయలు వెళతారని తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహం చేరుకుని మ.3 గం.లకు తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మ.3.50 వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు బయలుదేరి వెళతారని తెలిపారు.