రాష్ట్రపతికి విమానాశ్రయంలో సాదర వీడ్కోలు.


Ens Balu
3
Renigunta
2020-11-24 19:36:48

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్షించికుని  మంగళవారం  సాయంత్రం  6.30 గంటలకు చెన్నై తిరుగు ప్రయాణం సందర్భంగా  రేణిగుంట విమానాశ్రయం లో  భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వారికి సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్,  ఉప ముఖ్యమంత్రి  నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి   మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,  ప్రభుత్వ విప్  చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రాజ్యసభ సభ్యులు  విజయసాయిరెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, అడిషనల్ డిజిపిలు చంద్రశేఖర్ ఆజాద్, హరీష్ కుమార్, జెసి మార్కండేయులు, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్  రెడ్డి,  , అడిషనల్ ఎస్.పి. సుప్రజ జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్. సురేష్, సివిఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ సిఐఎస్ ఎఫ్ శుక్ల రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్ వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక విమానంలో రా.6.50 గంటలకు గన్నవరం బయలుదేరగా  సాదర వీడ్కోలు లభించింది..