తుపాను మ్రుతులకు రూ.5లక్షలు నష్టపరిహారం..


Ens Balu
2
Velagapudi
2020-11-28 16:26:08

ఆంధ్రప్రదేశ్ లో తుపాను కారణంగా మ్రుతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షలు నష్టపరిహారం అందించాలని సీఎం జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. నివర్‌ తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలైన చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం పంట నష్టాలను స్వయంగా చూశారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం మాట్లాడుతూ, తుపాను ప్రాంతాల్లోని వారికి తక్షణ సహాయం కింద రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. మూడు జిల్లాల్లోని పంట నష్టాలపై తక్షణమే అంచాలు వేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. తుపానుకి దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యే పర్యటించి వారికి దైర్యం చెప్పాలన్నారు. పునరావస కేంద్రాల్లో ఉన్నవారికి కూడా రూ.599 చొప్పున అందజేయాలన్నారు. వరద ప్రాంతాల్లో సహయక చర్యలు జరుగుతూనే ఉండాలన్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, మంచినీరు, మందులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.