15 నుంచి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం..


Ens Balu
1
Tirumala
2020-12-14 22:31:48

తిరుమలలో పవిత్ర మైన ధనుర్మాసం సందర్బంగా ప్రతిరోజు మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల నాద నీరాజన వేదిక మీద డిసెంబరు 15వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ దాకా రోజు ఉదయం 6 నుంచి 6-45 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదిక మీద టీటీడీ నిర్వహించిన కార్తీక పురాణ ప్రవచనానికి  భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వేద పండితులు శ్రీ మారుతి నిర్వహించిన ఈ ప్రవచనం సోమవారంతో ముగిసింది. భక్తుల స్పందన వల్ల మార్గశిర మాసంలో కూడా ఇలాంటి ప్రవచనం కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వేద పండితులు   శేషాచార్యులు నెల రోజుల పాటు ప్రవచనం చెబుతారు. ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.