ఈసారి సర్వదర్శనం టిక్కెట్లు స్థానికులకే..
Ens Balu
2
Tirumala
2020-12-18 21:31:35
తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేస్తునట్టు టిటిడి ప్రకటించింది. డిసెంబర్ 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను కూడా డిసెంబర్ 21వ తేదీ లోపు జారీ చేస్తామని తెలియజేసిన టిటిడి భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించాల్సిందిగా కోరింది. కోవిడ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ,గతంలో జరిగిన శాంతిభద్రతలు, ఇతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యాయం వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు స్థానికులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు పేర్కొంది. దయచేసి స్థానికేతరులెవ్వరూ టోకెన్ల కొరకు రావద్దని మనవి చేయడమైనది. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని కోరింది.