సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఆధిత్యనాధ్ దాస్..
Ens Balu
3
Velagapudi
2020-12-23 17:49:57
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధిత్యనాధ్ దాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకం కలిశారు. ప్రస్తుతం సిఎస్ గా వున్న నీలం సాహ్ని ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అదేరోజు ఆధిత్యనాథ్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జీఓ కూడా జారీచేసింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిని ఆయన కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈయన మంచి అధికారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ప్రభుత్వం ఈయనను సిఎస్ గా నియమించిందని సమాచారం. సీఎస్ గా పలువు ఐఏఎస్ లు పేర్లు కేంద్రానికి పంపినా, ఆధిత్యనాధ్ దాస్ పేరును కేంద్రం ఖరారు చేసింది.