దాత్రుత్వం చాటుకున్న కొండా రాజీవ్..


Ens Balu
4
Guntur
2020-12-24 12:33:39

వైఎస్సార్సీపీ విశాఖ యువజన అధ్యక్షులు, అధికార ప్రతినిధి కొండారాజీవ్ గాంధీ తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయ మేనేజర్ రంగయ్యను స్వయంగా గుంటూరు వెళ్లి పరామర్శించారు. అంతేకాదు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్దిక సహాయం కూడా చేశారు. రంగయ్య ఇటీవల కాలంలో అస్వస్థతకు గురై గుంటూరులోని లలిత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయంతెలుసుకున్న రాజీవ్ వెంటనే గుంటూరు వెళ్లి రంగయ్యను పరామర్శించి వారికుటుంబానికి దైర్యం చెప్పి వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు సమాచారం అందించాలని కూడా భరోసా ఇచ్చారు. దేవుడి దయవల్ల  రంగయ్య అనతికాలంలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ  నవ్వుతు తిరిగి  విశాఖ పార్టీ కార్యాలయానికి తిరి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.