తిరుపతిలో రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్..
Ens Balu
5
Tirupati
2020-12-26 21:22:24
తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటి మీట్ నిర్వహిస్తున్నట్లు అనంతపూర్ రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా ఠాటా తెలిపారు. శనివారం ఆయన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి. ఏ.రమేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మొదటి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ 2021 జనవరి 4 నుంచి 7 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్-2020 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. దీనికి వేదికగా స్థానిక ఏ.ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్, PTC కల్యాణి డ్యాం ఆతిథ్యం ఇవ్వనున్నాయన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ యస్.పి స్థాయి అధికారి వరకు పాల్గొంటున్నారని చెప్పారు. కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వార్డ్, ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి, పోట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐ.ఓ ఫోటోగ్రఫీ మొదలగు వాటిపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన వారిని జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక చేస్తామన్నారు. అదేవిదంగా ప్రతి రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపదేవిధంగా విజ్ఞానాన్ని పెంపొందిచే చర్చా వేదికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక విద్యార్ధి కూడా వీటిని వీక్షించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కర్యరమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత , రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ పాల్గొని ప్రారంబిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ట్రైనీ ఐ.పి.యస్ అధికారులు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.