రైతులకు ఉపయోగపడేలా ఉపకరణాలుండాలి..
Ens Balu
3
Gannavaram
2020-12-28 18:41:09
సామాన్యరైతులకు అందుబాటుధరల్లో వ్యవసాయ ఉపకరణాలు తయారుచేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సిపెట్ విద్యార్ధులు, అధ్యాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కు పిలుపునిచ్చారు. సోమవారం గన్నవరం మండలంలోని సూరంపల్లి గ్రామంలో కోవిడ్ సక్రమణ తర్వాత ద్వితీయ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సిపెట్ సంస్ధ పురోభివృద్ధిని పరిశీలించి, అనంతరం విద్యార్ధులతో ముచ్చటించారు. ఈసందర్భంగా యం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కోవిడ్ సంక్రమణ సందర్భంగా వర్చువల్ సభల కంటే నేరుగా ముఖాముఖి సమావేశం పెట్టుకోవడమే ఎంతో తృప్తినిస్తుందని చెప్పారు. నాణ్యత, ప్రామాణికత, అత్యల్పధరలతో వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఆరోగ్యం, ఆటోమొబైల్, మానవుడుకి అనునిత్యం అవసరమయ్యే సెల్ ఫోన్, పెన్ను వాటిల్లో కూడా ప్లాస్టిక్ వినియోగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయరంగంలో కూడా క్రొత్త ఆవిష్కరణలు పెరిగితే అవి రైతుకు ఎ ంతో ఉపయోగపడతాయన్నారు.
ప్రకృతి అందించిన సంపదను భవిష్యత్తు తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతితో స్నేహంగా ఉండకపోతే సమాజమంతా నష్టపోవాల్సి వస్తుందని దానికి తార్కాణాలు ఎ న్నో మనముందుకు వచ్చాయన్నారు. ప్లాస్టిక్ వాడకం, దాన్ని వాడిన తర్వాత తిరిగి మళ్లీ ఉపయోగంలోకితేవడం జరగాలన్నారు. నష్టాల్లో ఉన్న సిపెట్ విద్యాసంస్ధ లాభసాటి వ్యవస్ధగా ఎ దగడం చాలా సంతోషాన్నిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణాతో విడిపోయినప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు ఏమీ లేవని తనకు ఆందోళనగా ఉండేదన్నారు. కేంద్రప్రభుత్వం సహకరించడం వల్ల 36 కేంద్రసంస్ధలు రాష్ట్రంలో నెలకొల్పామన్నారు. క్రొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి తనవంతుపాత్రగా సంబంధిత మంత్రిత్వశాఖల మంత్రులతోనూ, అధికారులతోనూ చర్చించి లాభసాటిగా నిలిచేలాగా ఉన్న పధకాలు వివరాలు తెలుసుకుని వాటి అమలుకు కృషి చేశానన్నారు. ఆదిశలో ఆయా మంత్రులు, అధికారుల సహకారం హర్షణీయం అన్నారు.
సిపెట్ ఏర్పాటు సందర్భంలో అప్పటికేంద్ర మంత్రి అనంతకుమార్ , ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చినసహకారం, తోడ్పాటు అభినందనీయం అని ఈసందర్భంగా వారిని శ్లాఘించుకోవడం మన కర్తవ్యం అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశంలో 65 శాతంమంది జనాభా 35 సంవత్సరాల లోపువారు కాగా, 15 శాతం మంది 36 నుండి 50 సంవత్సరాలలోపువారు ఉన్నారన్నారు. యువతరాన్ని నైపుణ్యాభివృద్ధి , సాంకేతికత, పరిశోధనలు, విద్యాసంబంధిత అంశాలలో ప్రోత్సహించడం ద్వారా గణనీయమైన అభివృద్ధిని సాధించగలుగుతామన్నారు. ప్రకృతితో కలిచి నడవాలని, ప్రకృతిని ప్రేమించాలని, పర్యావరణానికి హానికలిగించే వాటిపట్ల జాగురూకత వహించాల్సి ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వం వల్ల మాత్రమే ఇది సాధ్యంకాదని ప్రజల స్వచ్ఛంధ భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఉత్తమఫలితాలను సాధించగలుగుతామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను మళ్లీ ఉపయోగంలోకి తేవడంపై ప్రత్యేక దృష్టి పెట్టమని సిపెట్ అధికారులను వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.
నాణ్యత, ఎ క్కువకాలం మన్నిక వస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణానికి సవాళ్లు విసురుతోందని ఆయన చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మరింత నష్టంకలగజేస్తుందన్నారు. దీనికి పరిష్కారం ప్లాస్టిక్ను నియంత్రించడం కానేకాదని, వినియోగదారుల్లో బాధ్యత, సక్రమంగా రీసైకిల్ చేసుకోవాలన్నారు. త్వరలో నెల్లూరు జిల్లాలో సిపెట్ సంస్ధ ఏర్పాటుచేస్తామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన అంగీకారాన్ని కూడా తెలిపిందన్నారు. ఈసమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పెట్రోలియం మరియు పెట్రోకెమికల్స్ జాయింట్ సెక్రటరీ కాశీనాధ్ఝూ మాట్లాడుతూ 2016 లో కేంద్రమంత్రిగా యం. వెంకయ్యనాయుడు చేతులుమీదుగా సిపెట్కు శంఖుస్ధాపన జరిగిందన్నారు. అదేసంస్ధ అభివృద్ధి చెంది దాదాపు 9500 మంది విద్యార్ధులకు కళాశాలల్లో శిక్షణ కూడా ఇచ్చిందన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా పిల్లలఆటవస్తువుల తయారీలో సిపెట్ కృషి చేస్తోందన్నారు. ఫ్లెక్సిబుల్, ఎ లక్ట్రానిక్ ఆటవస్తువుల రూపకల్పనకు విశేషంగా కృషి జరుగుతోందన్నారు.
సిపెట్ డైరెక్టర్ జనరల్ డా. యస్.కె. నాయక్ మాట్లాడుతూ భవిష్యత్తులో విజయవాడనగరం ఒక గ్లోబల్ సిటీగా మారనుందని, ఆకేంద్రంలో సిపెట్ విద్యాసంస్ధ నెలకొల్పేందుకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక కృషి చేశారన్నారు. దాదాపు 3 లక్షలమంది విద్యార్ధులను తయారుచేస్తున్న దేశంలోని సిపెట్ సంస్ధలు వచ్చే 2024 నాటికి 5 లక్షలకు విద్యార్ధులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో రాష్ట్రదేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సిపెట్ ప్రిన్సిపల్ డైరెక్టరు ఆర్. రాజేంద్రన్, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, సిపెట్ కేంద్రం ఇన్ఛార్జ్ శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.