సీఎం వైఎస్ జగన్ కు వేదపండితుల ఆశీర్వచనం..


Ens Balu
3
Tadepalle
2021-01-01 18:24:14

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. నూతన సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ సీఎంకి పూల బొకె ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ సీఎంతో కేక్ కట్ చేయించారు. అదేసమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టిటిడి చైర్మన్ వైవిసుబ్బారెడ్డి తిరుమల అర్చకులతో వచ్చి సీఎంకి శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు శ్రీవారి ఫోటో, డైరీ, ప్రసాదం అందజేయడంతోపాటు ఆశీర్వచనం అందజేశారు. అదే విధంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేద పండితులు, అధికారులు కూడా విచ్చేసి అమ్మవారి ప్రసాదాలు సీఎంకి అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. సిఎంఓలోని అన్ని శాఖల ప్రధాన కార్యదర్శిలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సీఎంకి నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.