కరోనాలో మీ సేవలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా..
Ens Balu
3
Tirupati
2021-01-04 18:50:21
భయంకరమైన కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానాని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ డ్యూటీ మీట్ -2020 లో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ కులాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హత గలిగిన ప్రతి పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. దశల వారి మధ్యపాన నిషేధం అమలుకు శ్రీకారం చుట్టి పేదలు ఉన్నత చదువులు చదువుకోవాలనే వుద్దేశ్యంతో ఇంగ్లీస్ మీడియం పాఠశాలు గా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఎస్.సి., బి.సి., మైనారటీలు బాగుపడాలని, బానిసతత్వం పోతే సమానత్వం వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ ఆశయం ప్రతి పేదవాడు ఉన్నతవిద్యలు చదవాలనే ఆశయానికి ముఖ్యమంత్రి అనుసరిస్తూ కులాలకతీతంగా డిప్యూటీ సి.ఏం.పదవులు ఎస్.సి., ఎస్.టి., మైనారిటీ, బి.సి., లకు ఇచ్చారని అన్నారు. సమాజంలో పవిత్ర మైన ఉద్యోగం పోలీస్, డిజిపి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు బాగున్నాయని, కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి ఆశయం మేరకు బ్యారాబిడ్డలను వదిలి సేవలందించారు ధన్యవాదాలు అన్నారు. నేడు జగన్ మోహన్ రెడ్డి గారు మాదవుడులా నవరత్నాలు అమలుచేసి కుటుంబాలను ఆడుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత మొదటి పోలీస్ మీట్ శ్రేవారి చెంత జరగడం మీకు ధైర్యాని కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్నో సంవత్సరాలు ఇల్లులేని పేదలకు దేశ చరిత్రలో లేనివిధంగా 30 లక్షలు పైగా ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వాలలో ఓటుహక్కు లేని గ్రామాలు జిల్లాలోనే ఏడు వుండేవి వారికి స్వాతంత్రం కల్పించారని అన్నారు.
తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ నాచిన్న తనంలో స్కాట్ ల్యాండ్ పోలీస్ అంటే గొప్పాని అంటే అప్పుడే మన పోలీస్ స్వేచ్ఛగా పనిచేయనిస్తే అంతకు మించి చేస్తామని ఆంద్రప్రదేశ్ పోలీస్ అన్న మాటలు గుర్తొస్తున్నాయని అనారు. సమర్థవంతంగా పనిచేయబట్టే నేడు అనేక బహుమతులు మన రాష్ట్ర పోలీసులు అందుకున్నారని అన్నారు. రాష్టా విభజన తరువాత 6 సంవత్సరాలు తరువాత ఈ పోలీస్ డ్యూటీ మీట్ -2020 జరగడం శుభపరిణామని సాంకేతిక నేరాలు దీనివల్ల అదుపులోకి వస్తాయనే నమ్మకం కలుగుతున్నదని అన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త మాట్లాడుతూ ప్రజాలుగాని, నేను గాని ప్రశాంతంగా వున్నమంటే పోలీస్ వ్యవస్త కారమని అన్నారు. గత పది సంవత్సరాల నా ఉద్యోగంలో పోలీస్ సిబ్బంది ప్రతిభా మెరుగుపడుతూ వుందని, దీనివల్ల ప్రజలే లాభపడుతున్నారనేది గుర్తించాలని అన్నారు. దేశ చరిత్రలో మన రాష్ట్రం నేడు ఎన్నో బహుమతులు అందుకున్నా దిశా యాప్ ద్వారా మహిళల్లో ధైర్యం, వారు వాడుతున్న విధానం చూస్తే అర్థమవుతుందని అన్నారు. శ్రీవారి పాదాల చెంత 6 సంవత్సరాల తరువాత పోలీస్ డ్యూటీ మీట్ అభినందనీయం అన్నారు.