అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..5
Ens Balu
3
Visakhapatnam
2021-01-20 10:27:02
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో సమాచార పౌరసంబధాల శాఖ వేరయ..ఈ శాఖలో ప్రభుత్వ మీడియా సలహాదారులు జర్నలిస్టులకిచ్చిన హామీలు.. మంత్రుల సూచనలు.. జర్నలిస్టు వ్యతిరేకతను పట్టించుకోకుండా వీరు మొండిగా కోర్టులకు సమాధానాలు చెబుతారయ..ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే ఎడిటింగ్ చేయని వార్తలో కాలుపెట్టినట్టే.. మీరు చదువుతున్నదంతా అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అబాసు పాలుచేయాలని చూస్తున్నారో..లేదంటే అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టులంతా ప్రభుత్వంపై తిరగబడేలా చేస్తున్నారో.. అదీకాదంటే దేశం మొత్తం ఏపీలోని సమాచరశాఖనే తొంగిచూసేలా మీడియాను నియంత్రించేలా చేయాలని ప్రత్యేక పథకం వేశారో తెలీదు గానీ.. సమాచారశాఖలో ఉన్నతాధికారులు జర్నలిస్టులు ఏమైపోయినా తాము అనుకున్నదే చేస్తూ ముందుకు వెళుతూ వార్తల్లో నిలుస్తున్నారు.. మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని నిబంధనలు అమలు చేసి వేలల్లో వున్న అక్రిడేటెడ్ జర్నలిస్టులను వందల్లోకి తెచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నామనే సంకేతాలను పంపుతున్నారు.. నిబంధనలు ఎవరికైనా ఒకేలా వర్తింపచేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమాచారశాఖ మాత్రం డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిబద్దతగావున్నా..మంత్రులు ముక్కుసూటిగా వున్నా..మీడియా సలహాదారులు సూచనలు చేస్తున్నా అవేమీ తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల వ్యవహారంలో ఇటు మంత్రులు, మీడియా సలహాదారులు జర్నలిస్టు సంఘాలకు పత్రికా ముఖంగా ఎవరికీ అన్యాయం జరగకుండా అక్రిడిటేషన్లు ఇస్తామని, ఆందోళన చెందవద్దని హామీలిస్తూ అదే మీడియాలో ప్రకటిస్తున్నా..తాము మాత్రం ఇచ్చిన జిఓ నెంబరు 142 ఆధారంగానే వ్యవహరిస్తామంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్లపై కెనీసం అవగాహన లేని అధికారులను అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా చేర్చి, జర్నలిస్టుల సంఘాలను పక్కకు పెట్టిన విషయమై ఇప్పటికే కోర్టుకి వివరణ ఇచ్చేపనిలో పడినా..నేటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు సరికదా.. ప్రభుత్వం తరపున ఇచ్చిన జీఓ ప్రకారం అయినా అక్రిడిటేషన్లు సక్రమంగా ఇస్తున్నారా అంటే దానికీ సరైన సమాధానం ఇవ్వడంలేదు.. పెద్ద పత్రికలకు వారి సొంత న్యూస్ ఏజెన్సీల ద్వారా ప్రచురితమైన క్లిప్పింగులను అనుసరించి పత్రిక పేరుతో అక్రిడిటేషన్లు మంజూరు చేశారు సమాచారశాఖ అధికారులు. అసలు ఒక పత్రికకు పత్రికపేరుతో వచ్చే క్లిప్పింగులతో కాకుండా న్యూస్ ఏజెన్సీ క్లిప్పింగులతో దరఖాస్తు చేస్తే ఆ పత్రికలకు పత్రికల పేరుతో అక్రిడిటేషన్లు ఎలా ఇస్తారు..దానికి ఏదైనా ప్రత్యేక జీఓ వుందా..అలాని సదరు పత్రికలు న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అక్రిడిటేషన్లకు దరఖాస్తు చేశాయా అంటే దీ లేదు.. కానీ జీఓలో ఉన్నట్టుగా సంబంధిత అధీక్రుత పత్రాలు, క్లిప్పింగులు, ఇతరత్రా అన్నీ ఆన్ లైన్ సమర్పిస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇవ్వమని తెగేసి చెబుతున్న అధికారులు పెద్ద పత్రికలు న్యూస్ ఏజెన్సీ క్రెడిట్ లైన్ తో పెట్టిన క్లిప్పింగులకు ఎలా అక్రిడిటేషన్లు ఇచ్చారనే విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే విషయమై విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన 15 అంశాల సమాచారహక్కు చట్టం దరఖాస్తులో ప్రస్తావించిన అంశాలను ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే విధంగా ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ల ద్వారా అడ్డగోలు వ్యవహారాన్ని బహిర్గతం చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం ఈ విషయమే రాష్ట్రంలో హాట్ టాపిక్. విశాఖజిల్లాలో దాఖలైన సమాచారహక్కు చట్టంలోని అంశాలకు సమాధానం చెప్పకపోయినా, నిబంధనలను అతిక్రమించి ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారంలో ఖచ్చితమైన సమాచారం మొక్కుబడిగా ఇచ్చినా సదరు దరఖాస్తు దారుడు సమాచారశాఖ ఇచ్చిన ఆధారాలు, ప్రభుత్వ నిబంధనలు, దేశరాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అమలు చేసే నిబంధనలతో కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే పుండుపై కారం చల్లినట్టుగా, ఇప్పటికే అత్యుత్సాహంతో కోర్టులకు వివరనిస్తూ వస్తున్న సమాచారశాఖ ఇపుడు మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను కూడా ఇరకాటంలోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యంగా విశాఖజిల్లాలో జరిగే అక్రిడిటేషన్ కమిటీలో జరిగిన సమావేశ అంశాలు(మినిట్స్)ను సమాచారశాఖ అధికారులు ఎప్పుడూ సమావేశంలో రాయరు. ఇదే విషయమై గతంలో కూడా గొడవులు జరిగాయి. ఇలా చాలా తప్పులు చేసిన సమాచారఖను ఏదోలా ఒడ్డున పడేయాలని చూస్తున్న మీడియా సలహాదారుల సూచనలు కూడా సమాచారశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కోర్టు మెట్లెక్కి కౌంటర్లైనా దాఖలు చేస్తున్నారు తప్పితే తాము ఇచ్చిన జీఓని మార్చేది లేదంటూ వివిధ శాఖల అధికారులతోనే అక్రిడిటేషన్ కమిటీలు నిర్వహిస్తూ వచ్చారు. అందులో కొన్ని పెద్ద పత్రికలకు న్యూస్ పేపర్ ఫార్మాట్ లోనూ, ఇటు న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లోనూ కాకుండా దాఖలు చేసిన అక్రిడిటేషన్ ఫైలును ఆమోదించి ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సమాచారశాఖకు, జర్నలిస్టులకు మధ్య జరుగుతున్న వార్ ను తగ్గించడానికి ప్రభుత్వంలోని మీడియా సలహాదారులు జర్నలిస్టులకు ఇచ్చే హామీలను సమాచారశాఖ పట్టించుకోకుండా తాము అనుకున్నట్టే చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులో గౌరవ ప్రధమైన స్థానంలో వున్న రాష్ట్ర మీడియా సలహాదారులు, జాతీయ మీడియా సలహాదారుల సూచనలు, సలహాలు మాకు పట్టవన్నట్టు వ్యవహరిస్తోంది. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..6 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు జీతాలు అమలు చేస్తున్నాయి..ఎన్ని మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు కూడా తీసుకోకుండా పత్రికల నిర్వహణ చేస్తున్నాయి.. ఎన్ని న్యూస్ ఏజెన్సీలు అక్రిడిటేషన్ల దరఖాస్తు చేసినపుడు అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు ఇచ్చాయి..ఇవ్వకుండానే ఎన్ని సంస్థలకు అక్రిడిటేషన్లు జారీచేశారు తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!