తప్పుడు పోస్ట్ లపై పోలీసు కేసులు నమోదు..
Ens Balu
4
Tirumala
2021-01-25 22:03:25
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రతిష్ట దిగజార్చేందుకు సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన కుట్ర పై సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యక్తి గతంగా తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు భక్తుల్లో ఆందోళన చెలరేగేలా జరిగిన ఈ చర్యపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి లో ఇటీవల జరిగిన ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల మీద జరిగిన దాడుల గురించి విలేకరులు శ్రీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రజలందరినీ భగవంతుడు ( శ్రీ వేంకటేశ్వర స్వామి) జీసస్, అల్లా కాపాడుతున్నారనీ, వారి మీదే దాడులు చేసే వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని సుబ్బారెడ్డి చెప్పారు.ఇది ముఖ్యమంత్రి మీద కొన్ని పార్టీలు చేస్తున్న కుట్ర అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు ఈ వీడియోను కట్ చేసి ఆయన మాటల్లోని ఉద్దేశం మార్చేలా వీడియో అతికించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ సుబ్బారెడ్డి స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడారు. ఈ దుష్ప్రచారం, కుట్రపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.