గ్రామ సచివాలయ ఉద్యోగులకు మహర్ధశ..


Ens Balu
4
Vijayawada
2021-02-19 10:06:23

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మహర్ధశ ప్రారంభమైంది. సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వంలో ఈ శాఖకు కమిషనరేట్ ప్రారంభించిన ప్రభుత్వం వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపజేయనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వీరందరూ అపుడే 16 నెలలు విధులు నిర్వహించారు. ప్రభుత్వం తొలుత ప్రకటించినట్టుగా వీరికి రెండేళ్లు ప్రొహిబిషన్ పూర్తయిన తరువాత వీరి సర్వీసును రెగ్యులర్ చేయనుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుతోపాటు పాటు ఇపుడు గ్రామపంచాయతీలు కూడా పూర్తిస్థాయిలో ప్రారంభమవడంతో వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపచేయడానికి ముందుగా వీరందరికీ సర్వీస్ రిజస్టర్(ఎస్ఆర్)ను ఈ మార్చి 30 నాటికల్లా ప్రారంభించాలని అధికారులను ఈ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. సర్వీస్ రూల్స్ సచివాలయ ఉద్యోగులకు అమలు అయితే వీరంతా రెగ్యులర్ ఉద్యోగులకిందకే వస్తారు. దీనితో చాలా మంది చేస్తున్న అసత్య ప్రచారాలు..ఈ ఉద్యోగాలు ఎంతో కాలం ఉండవు..ప్రభుత్వం వీటిని వచ్చే ఏడాది నుంచి తొలగించేస్తుదనే ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. ఎస్.ఆర్ స్టార్ట్ అయితే రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే కారుణ్యనియామకాలు, హెల్త్ కార్డు, శాఖాపరమైన పరీక్షలు, శిక్షణ, శెలవులు, డ్రెస్ కోడ్ ఇలా అన్ని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా వీరికి కూడా వర్తింపజేస్తారు. రెండేళ్లు ప్రొహిబిషన్ పూర్తి అయ్యేలోపు వీరిందరికీ కమిషనరేట్ ద్వారా అమలు చేసే అన్ని పనులూ పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా ఇంకా భర్తీకాకుండా మిగిలిపోయిన ఉద్యోగాలను కూడా జిల్లాల వారీగా సేకరించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కమిషనర్ గా ప్రభుత్వం నియమించిన డా.నారాయణ భరత్ గుప్తా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. దేశంలోనే చక్కటి వ్యవస్థగా రూపొందిన గ్రామసచివాలయ వ్యవస్థను ఇప్పటికే కేరళ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చూస్తుండగా...రాష్ట్రంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే వ్యవస్థను అమలు చేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో ఈ శాఖను దేశానికే వన్నె తెచ్చే విధంగా తయారు చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని అధికారులు అమలు చేసి ఆచరణ లో పెడుతున్నారు. అనతి కాలంలో ఈ ఉద్యోగాలపై ఉద్యోగులు, ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.