గ్రామ సచివాలయాలకు స్పీడ్ ఇంటర్నెట్..
Ens Balu
2
Tadepalle
2021-02-24 08:37:57
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు అంతరాయం లేని స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని వైఎస్ జగన్ సర్కారు భావిస్తుంది. మైదాన, పట్టన ప్రాంతాల్లో సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా ఏజెన్సీ గ్రామాల్లోని సచివాలయాలకు ఆ ఇబ్బందులు చాలా అధికంగా వున్నాయి. చాలా గ్రామ సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వలన గిరిజన ప్రాంతాల్లో చాలా ఆన్ లైన్ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. అదే సమయంలో ప్రతీగ్రామానికి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ నెట్ సౌకర్యం కల్పించాలనే భావనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలోని ఒక ఇంటర్నెట్ స్టేషన్ ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది. గతంలోనే ఈ ప్రాజెక్టు కోసం అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకల కారణంగా వాటి సేవలు ప్రజలకు పెద్దగా అందలేదు. ప్రస్తుతం అన్ని సచివాలయ పనులకు, సంక్షేమ పథకాల నమోదుకు ఇంటర్నెట్ అత్యవసరం కావడంతో ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని చూస్తుంది. ఇప్పటికే ఆఫ్ లైన్ లోవున్న కేబుల్ వ్యవస్థను అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థల్లోకి మార్పులు చేస్తూ వస్తుంది. ఇకపై గ్రామాల్లో ఎవరికి ఇంటర్నెట్ కావాలన్నా గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే..దాని నుంచి ఆ గ్రామంలో వున్న కేబుల్ ఆపరేటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులోనూ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా టెలీఫోన్, ఇంటర్నెట్, కేబుల్ టివి, వైఫై అన్ని వస్తుండటంతో వాటినే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు వర్తింపచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 5400 గ్రామాల్లో ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలను విస్తవరించగా, దానికోసం 24వేల కిలోమీటర్ల పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ను ఏర్పాటు చేశారు. సుమారు 15వేల గ్రామ, వార్డు సచివాలయాలలు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అన్ని ప్రభుత్వ పాఠశాఠశాలలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు పది లక్షల మంది కుటుంబాలకు ఏపీ ఫైబర్ నెట్ సేవలను దగ్గర చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇంటర్నెట్ అందించాలని కూడా చూస్తుంది. ప్రతి విద్యార్ధికి ప్రస్తుతం ఇంటర్నెట్ భాగం అయిపోవడంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ విస్తరించి ప్రభుత్వసేవలు అందించాలని చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా పనులు నడుస్తుండగా, రాష్ట్రంలోని అన్ని నూతన గ్రామ సచివాలయాలు నిర్మాణాలు పూర్తి అయ్యే నాటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022 మార్చినాటి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతోపాటు 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు వేయనున్నారు. ఇప్పటి వరకూ 2800 గ్రామ, వార్డు సచివాలయాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. వీటితో పాటు 11274 గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సేవలను విస్తవరించనున్నారు. వీటితోపాటు గ్రామాల్లో ఉచిత వైఫై టవర్లు కూడా పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో గ్రామాల్లోకి ఇంటర్నెట్ కనెక్షన్ లు అందుబాటులోకి వస్తే ఆన్ లైన్ సేవలకు, ప్రభుత్వ పథకాల అమలకు, విద్యార్ధుల ఆన్ లైన్ క్లాసులకు ఎలాంటి డోకా లేకుండా ఇంటర్నెట్ అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన పనులను చకచకా చేపడుతుంది..!