27న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి రద్దు..
Ens Balu
1
Tirumala
2021-02-26 14:15:32
తిరుమలలో ఫిబ్రవరి 27వ తేదీన జరగాల్సిన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా కుమారధార తీర్థంలోకి భక్తులకు అనుమతి లేదని టిటిడి స్పష్టం చేసింది. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.