తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ కేసు..
Ens Balu
3
Tadepalle
2021-02-26 19:27:58
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సెలవులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్టు విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సాకు చూపి మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు అంటూ ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వాటిని ఎవరూ నమ్మవద్దన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలైనా నేరుగా ప్రభుత్వ పాఠశాలలు లేదా డిఈఓ, ఎంఈఓల ద్వారా మాత్రమే ప్రభుత్వం ప్రటిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు యధావిధిగానే నడుస్తాయన్నారు. ఈమేరకు అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి వివరించారు.