TTD ఎక్స్ అఫిషియోగా డాజి.వాణీమోహన్..
Ens Balu
1
తిరుమల
2021-02-27 21:38:31
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.జి.వాణి మోహన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి డా.జి.వాణి మోహన్ తో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ సుధారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.