ఉదయమంతా జిల్లా కలెక్టర్.. మధ్యాహ్నామంతా జిల్లా మంత్రి వెనుక ఎంపీడీఓ చక్కెర్లు..
Ens Balu
1
Tadepalle
2021-03-05 17:28:01
ఒక జిల్లా మంత్రికి తెలియకుండా ఒక అవినీతి అధికారి నేరుగా పంచాయతీరాజ్ శాఖ నుంచి రెగ్యులర్ పోస్టు కోసం పైరవీలు చేసి మరీ జీఓ తెచ్చుకుంటే అది అమలు కావడానికి మాత్రం క్షేత్రస్థాయిలో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి.. అవును మీరు చదువుతున్నది నిజమే విశాఖజిల్లా పంచాయతీ అధికారిణిగా వున్న క్రష్ణకుమారిని బదిలీల చేస్తూ జిఏడీఓ రిపోర్టుచేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఐదురోజుల క్రితం జీఓ జారీచేశారు. అదే సమయంలో వీఆర్ పురం ఎంపీడీఓకి ఇదే స్థానాన్ని మంజూరు చేస్తూ డిపీఓ(ఎఫ్ఏసీ)గా చేరాలన్నది ఆ జీఓలోని సారాంశం. అయితే ఒక జిల్లాలో ఏ అధికారికి బదిలీ జిరిగినా, పోస్టింగ్ ఇచ్చినా ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు మంత్రులకు, ఆ అధికారియొక్క ట్రాక్ రికార్డ్ ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా తమ జిల్లాలోకి తీసుకొచ్చి పచేయిస్తారు. విచిత్రంగా ఈ ఎంపీడీఓ మాత్రం జిల్లా మంత్రికి తెలియకుండా తాను డిపీఓగా చేరడానికి జీఓ రప్పించుకోవడంలో సఫలీక్రుతారాలయ్యారు. ఆవిషయం కాస్త మంత్రికి, జిల్లా కలెక్టర్ కు తెలియడంతో జిల్లా కలెక్టర్ ఉదయం ఆమెను విధుల్లోకి చేర్చుకోవడానికి విముఖ చూపించారు. పైగా ప్రస్తుతం వున్న అధికారిణి మున్సిపల్ ఎన్నికల్లో అధికారిణిగా ఉండటం, బాగాపనిచేసిన మంచిపేరు సంపాదించారు. అదే సమయంలో ఆ వచ్చే ఎంపీడీఓపై అవినీతి అభియోగాలతోపాటు, క్రిమినల్ కేసులు కూడా కోర్టులో పెండింగ్ లో ఉండటంతో అధికారులు ఈమెను విధుల్లోకి చేర్చుకోవడానికి వెనుకడుగు వేశారు. దీనితో ఉదయమంతా జిల్లా కలెక్టర్ ను కలవడానికి విఫలయత్నం చేసి, ఇక లాభం లేదనుకొని ఏ మంత్రికైతే తెలియకుండా జీఓ తెచ్చుకున్నారో అదే మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును ప్రసన్నం చేసుకోవడానికి మధ్యాహ్నం నుంచి ఆయన వెంట తిరుగుతున్నారు. అందులోనూ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జిల్లా మంత్రి పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ లో పాల్గొన్నా, ఎలాగైనా మంత్రిని కలిసి విధుల్లో చేరిపోవాడానికి విఫల యత్నాలు చేస్తున్నారు అ అధికారిణి. వాస్తవానికి జిల్లా కలెక్టర్ సదరు అధికారిణిని తిరస్కరించారంటే దానికి కారణం ఎన్నికల విధులు ఒక కారణమైతే, మరొక కారణం ఆమె విశాఖజిల్లాకు వస్తున్నారని తెలిసి మీడియా మొత్తం ఆమె అవీనిపై కోడై కూయడం రెండో కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఆది నుంచి అవినీతి అధికారిణి సుభాషిణి విషయంలో వాస్తవాలు, ప్రభుత్వ అధికారిక అవినీతి విచారణలు, క్రిమినల్ కేసులు, తూర్పుగోదావరి జిల్లా జెసి, ప్రస్తుత విచారణ అధికారి డిపీఓ ఎంక్వైరీ రిపోర్టులు ఇలా అన్నింటిని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజాప్రతినిధులకు తెలిసేలా లైవ్ అప్డేట్స్ న్యూస్ కార్డ్స్ గా ఇస్తూ వస్తోంది. ఈ తరుణంలో ఆ అవినీతి అధికారిణిని విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసీ)గా చేర్చుకోవడానికి ఎవరూ సముఖ చూపించలేదు. ఇటు జిల్లా కలెక్టర్ దగ్గర ప్రయత్నంచి విఫలమై, అటు ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటూనే జిఓ అమలు కోసం అటు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలోనూ సదరు అధికారిణి ముందుంటూ వచ్చారు. కానీ పనిమాత్రం జరగలేదు. అసలు ఇన్ని అవినీతి అభియోగాలు, ప్రభుత్వ విచారణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ అధికారిణి ఎలా మరోచోటికి జిల్లా మంత్రికి కూడా తెలియకుండా బదిలీ చేశారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గామారింది. ఎలాగైనా తనకు తెలిసిన మరో ఎమ్మెల్యే ద్వారా మంత్రితో మంచి అనిపించుకొని విధుల్లోకి చేరాలన్నది ఆమె యొక్క లక్ష్యం.. అసలు ఇన్ని కారణాల నేపథ్యంలో ఆ అవినీతి అధికారిణిని విశాఖజిల్లా డీపీఓగా చేర్చుకుంటారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆశక్తి కర జిల్లా పంచాయతీ అధికారిణి అడ్డగోలు పోస్టింగ్ ఆర్డర్ విషయంలో ఆ అవినీతి అధికారిణికి జీఓ ప్రకారం పోస్టింగ్ విశాఖలో ఇచ్చేస్తారా..ఇపుడు జరిగే పని కాదని తిరస్కరిస్తారా..లేదంటే న్యాయ పరమైన చిక్కులొస్తాయని నచ్చజెప్పి పంపుతారా..మరికొంత సమయం వేచి ఉండమంటారా అనే తాజా సమాచారాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా మీకు తాజా సమాచారం అందిస్తామని తెలియజేస్తున్నాం.