మహిళా ఉద్యోగులకు శుభవార్త..


Ens Balu
1
Tadepalle
2021-03-10 19:55:15

ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళా ఉద్యోగులకు ఉన్న15 ప్రత్యేక సెలవుల(క్యాజువల్ లీవ్స్) ను మరో 5 సెలవులను కలిపి 20కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహరెడ్డికి మహిళా ఉద్యోగులకు ఈ వరం ప్రకటించారు. ప్రకటించిన రెండు రోజుల్లోనే అనగా ఈరోజే ప్రభుత్వం జీఓ నెంబరు 18ను తీసుకు వచ్చి అమలు చేయడానికి వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలకూ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది. దీనితో రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సెలవులకు సుమారు నాలుగు యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వానికి  ముందస్తుగా లేఖలు సమర్పించాయి.