ఏపీలో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి జోరు..


Ens Balu
1
Tadepalle
2021-03-14 10:44:32

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుపెంచింది. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు ఎగిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 30 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ టిడిపి ఒ వార్డు, జనసేన కూడా తన స్థానాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది ఇప్పటి వరకూ 4 స్థానాలను జనసేన తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఎక్కడా ఇప్పటి వరకూ బోణీ కొట్టలేదు.  విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం సేవ్ స్టీల్ ప్లాంట్,  అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది.