కర్పోరేషన్లలో 3 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం..


Ens Balu
3
Tadepalle
2021-03-14 10:57:24

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వేగంతో అపుడే రాష్ట్రంలో మూడు మున్సిపల్ కార్పోరేషన్ల(కడప, చిత్తూరు) ను వైఎస్సార్సీపీ  సొంతం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా తన స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తుంది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు తమ స్థాలనా పరిస్థితి ఏంటనే విషయంపైనే లెక్కలు వేసుకుంటున్నారు.  వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 37 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ మున్సిపాలిటీల్లో టిడిపి ఒవార్డు, జనసేన  5 వార్డులు తన ఖాతాలో వేసుకోగా, బీజేపీ ఒక్క దగ్గర కూడా తన బోణి కొట్టలేదు. ప్రస్తుత మున్సిపల్ ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ పరిపాలనకు రిఫరెండంగానే వస్తున్నాయనే విషయాన్ని విశ్లేషకులు సైతం ప్రకటిస్తున్నారు.  విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం ఓట్ల తోపాటు  సేవ్ స్టీల్ ప్లాంట్,  అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. ఈ ఎన్సికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు చాలా స్పష్టంగా తమ ఆలోచన ఎలా వుందో తెలియజేశారు. ప్రస్తుతం ఇదే విషయం అన్ని మీడియా సంస్థల్లోనూ డిబేట్లలో కొనసాగుతుండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది..