అభ్యంతరాలు లేకపోతే ధృవపత్రాలు జారీ..
Ens Balu
3
Vijayawada
2021-03-18 18:17:51
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్టు ఉత్తర్వుల పరిధికి లోబడి అభ్యంతరాలు లేని ఆక్రమణల ధృవపత్రాలు జారీకి వెంటనే చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్దాస్ చెప్పారు. స్ధానిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో సిసియల్ఏ, రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, కృష్ణా జిల్లా కలెక్టరుతో గురువారం విజయవాడ పరిధిలోని ఆక్రమణలో ఉన్న స్ధలాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్దాస్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రభుత్వ, ఇరిగేషన్, తదితర ప్రభుత్వ శాఖల అధీనంలో ఉన్నస్ధలాల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వ నిబంధనలు మేరకు క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు. ఇప్పటికే అటువంటి భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. భూముల క్రమబద్దీకరణ విషయమై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోనికి తీసుకుని ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టరు ఏయండి. ఇంతియాజ్కు సూచించారు. విజయవాడ నగరంలోని కృష్ణలంక లెఫ్ట్ కెనాల్, విజయవాడ వెస్ట్, సెంట్రల్, నార్త్, ఈస్ట్ మండలాల పరిధిలోని ఆక్రమణల్లో ఉన్న స్ధలాల విషయాలను సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈసమావేశంలో సిసియల్ఏ స్పెషల్ సియస్ నీరబ్కుమార్ ప్రసాద్, రెవెన్యూ సెక్రటరి వి.ఉషారాణి, ఇరిగేషన్ కార్యదర్శి జె. శ్యామలరావు, కృష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, కృష్ణాజిల్లా జలవనరుల శాఖాధికారులు పాల్గొన్నారు.