కరోనా వైరస్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Ens Balu
2
2020-06-21 15:27:47
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక వేత్త సానా రాధ అన్నారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు విశాఖలోనూ పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్ దరచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీరు అధికంగా తాగాలని సూచించారు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేదంటే ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఆరోగ్యసేతు యాప్ ని అంతా ఇనిస్తాల్ చేసుకొని అందులోని సూచనలు పాటించాలని సారా రాధ కోరారు.