డయల్ యువర్ ఈఓ రద్దు..
Ens Balu
2
తిరుమల
2021-05-05 14:01:12
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించే డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ డా.జవహర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పరమైన కార్యక్రమాలను ద్రుష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో పనిచేసే అర్చకులు, సిబ్బందికి, అధికారులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.