బ్లాక్‌ ఫంగస్‌ కి ఆరోగ్యశ్రీలో చికిత్స..


Ens Balu
2
Tadepalle
2021-05-20 14:58:43

బ్లాక్ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌)చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది..ఇప్పటికే కరోనాకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందిస్తున్న ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్ కి కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.