14మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం..


Ens Balu
1
Tadepalle
2021-05-31 06:19:51

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 14మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి..వాటిని వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభిస్తున్నారు. సుమారు 8వేల కోట్లతో ఈ మెడికల్ కాలేజీలతోపాటు, అనుబంధంగా నర్శింగ్ కాలేజీలను కూడా ప్రారంభిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ కాలేజీల నిర్మాణం పూర్తయితే  ఒకేసారి 1400 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్ధులకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా వీటిలో అధిక సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గర విషయం. తద్వారా గిరిజన విద్యార్ధులు కూడా అధిక సంఖ్యలో వైద్య విద్యను అభ్యసించడానికి వీలు కలగడంతోపాటు, వారు నివశించే ప్రాంతాల్లోని గిరిజనులకు వారే వైద్యసేవలు చేసే అవకాశం దక్కుతుంది.