ఆనందయ్య మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..


Ens Balu
2
Tadepalle
2021-05-31 08:35:21

కరోనా కాలంలో ప్రజల పిట్టల్లా రాలిపోతున్న వేళ ఆనందయ్య ఆయుర్వేదక కరోనా విరుగుడు మందుని వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.  దీనితో ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎవరి ఇష్టానుసారం వారు మందును వాడుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అనందయ్య మందు వాడితే కచ్చితంగా కరోనా తగ్గుతుంది అనేందుకు ఆధారమైన నివేదిక ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య ఇచ్చే మందుల వల్ల హానీ కూడా లేదని తేలింది.  ఇలాంటి విపత్కర సమయంలో ఆనందయ్య మందు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న వేళ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందింది..