జూమ్ లో బీఎంఎస్ 3వ రాష్ట్ర మహాసభ..


Ens Balu
2
Tadepalle
2021-06-12 16:28:29

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్ర సమావేశం రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్టు అధ్యక్ష, కార్యదర్శిలు ఎం.శ్రావణ్ కుమార్, ఎల్ ముత్యాలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఒక ప్రటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ హిరణ్మన్య పండ్య, ఉపాధ్యక్షులు ఎల్పీ కటక్వార్, ఎం జగదీశ్వర్రావు, సౌత్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.దురారీరాజ్ పాల్గొంటారని అన్నారు. వీరితోపాటు బిఎంఎస్, బిటిఈయూ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్.సత్యన్నారాయణ, జిల్లా కార్యదర్శిలు డివి.ప్రసాద్(విశాఖపట్నం) , సోమేశ్వరరావు(శ్రీకాకుళం), క్రిష్ణారావు(విజయనగరం), రాష్ట్ర కార్యదర్శి ధర్మాంగుదుడు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశాలు రాత్రి ఏడు గంటల వరకూ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర సమావేశాల్లో సంఘ్ చేపట్టిన కార్యక్రమాలతోపాటు, చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా సుదీర్ఘ చర్చ జరుతుందని వివరించారు.