పచ్చరాతలు.. పచ్చికూతలు అన్నన్నా..


Ens Balu
2
Visakhapatnam
2021-07-03 09:34:34

‘నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు...’అన్నట్టు మీకనిపించలేదా పచ్చరంగు పులుముకున్న వారందరికీ.. పచ్చ పచ్చని రాతాలు రాసేవారందరికీ.. నిన్నటి పుట్టిన రోజు వేడకలను ప్రశ్నించిన ఆచార్యులంతా చదువులమ్మ ఒడి ఆంధ్రాయూనివర్శిటీ మైదనాంలో నాడు మహానాడు జరుగుతున్న సమయంలో ఏం చేశారు..ఇంకేం పీకారు.. ఓహో సిగ్గుతో రాజకీయ ప్రశంగాలు వినకలేక చెవులు మూసుకున్నారా.. రాజకీయనాయలు నేరుగా వచ్చి చదువులమ్మ ఒడిలో సభలు పెడితే చూడలేక కల్లు కుట్టుకున్నారా.. నాడు చేయని ఆందోళనలు.. బాధ నేడేంటని మీకు అనిపించలేదా.. నేడు ఆ పచ్చ విద్యార్ధులే ఇపుడు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టో కనీసం అర్ధం చేసుకోలేని ప్రజలున్నారంటారా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివ్రుద్ధిని చూసి ఓర్వలేని వారంతా పుట్టిన రోజు వేడుకలను రాజకీయం చేయాలని చూస్తే.. ఏకంగా నాడు.. మహానాడుతో వారు చేసిన రాజకీయం మేము చేస్తే.. సంసారం.. మీరు చేస్తే వ్యభిచారం.. అన్నట్టుగా చిత్రీకరించే ఆ పక్షనేతలు.. ఈ పచ్చరాతలు.. నిజంగానే మాటల కందని అర్ధాలు తీసినట్టుగానే ఉన్నాయి. భావ ప్రకటన అభిమానాన్ని కేకు కట్ చేస్తే.. చూపిస్తే.. చదువులమ్మ తల్లి పరువుపోయిందా.. అన్నన్నా.. ఎంత మాట ఎంతమాట.. కలం కల్మషంగా రాయాలి తప్పా.. కలం కలుషితంగా మారి అక్షరాలు రాస్తే.. అవి వక్రభాష్యాన్నే చూపుతాయనడానికి ఎంపీ వి.విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రాయూనివర్శిటీలో జరిగినందుకు రాసిన పచ్చరాతలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు..నిజమైన ఆచార్యాలు..రాజకీయాలు చేయని విద్యార్ధులు..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై రాజకీయ బురద చల్లేందుకు చదువలమ్మ ఒడి.. ఆంధ్రాయూనిర్శిటీని వేదిక చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని గుండెలు అవిసేలా బాధుకొని రాజకీయం చేసేవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి సూచిస్తున్నారు వాస్తవాలు తెలిసిన వారంతా.. ఒక వేల వారి వేలే ముందుకి చూపిస్తే నాలుగు వేళ్లు తప్పుచేసిన వారిపైనే చూపిస్తాయనే విషయం మరిచిపోకూడదు అలాంటపుడు అంటూ హితబోద చేస్తున్నారు. విసి చాంబర్ లో  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినందుకు..పెద్ద ఎత్తున  రాజకీయ బురదచల్లాలని చూసిన వారంతా ముందు వారేం చేశారో.. వర్శిటీ పరువుని ఏ విధంగా తీసేశారో గుర్తుచేసుకోవాలని నానా గడ్డి పెడుతున్నారు. పేరుపొందిన ఆంధ్రా యూనివర్శి పరువు పోతుందని గగ్గోలు పెట్టిన ఆ.. రంగు ఆచార్యులు.. ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టిన తెలుగు తమ్ముళ్లు ఒకే ఒక్కసారి ముక్కున వేలేసుకొని ఆలోచించాలి.. నాడు అధికారంలో ఆ తెలుగుదేశం పార్టీ.. ఏకంగా తన రాజకీయవేడుక మహానాడు కోసం ఆంధ్రాయూనివర్శిటీ మైదానాన్ని వాడుకొని రాజకీయం చేసిందో.. నాడు రాయని రాతలు...నాడు కనిపించని ద్రుశ్యాలు నేడే కనిపించాయా కొంపదీసి.. అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. నిన్న ఒక్క వీసి మాత్రమే తన చాంబర్ లో కేక్ కట్ చేసిన ఉండొచ్చుగాక.. మరీ మీ పార్టీ అధినేత సాక్షిగా ఎన్ని వేల మంది పచ్చ పార్టీ నేతలు ఆంధ్రాయూనివర్శిటీలో రాజకీయ సభలు పెట్టి పరువుతీశారో గుర్తుకు రాలేదా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులు చదువుల తల్లి సరస్వతి సొంతింటిలాంటి ఆంధ్రాయూనివర్శిటీ సాక్షిగా రాజకీయం చేసినపుడు గుర్తుకి రాలేదేమో.. అపుడు లేని ఆలోచన..ఆపుడు రాయలేని రాతలు ఇపుడెందుకు గుర్తొచ్చాయో మరి.. వాస్తవాలు రాసేవారంతా ఎప్పుడూ వాస్తవాలనే రాయాలి..నాడు మన పార్టీ అని ఆహా ఓహో అని పొగిడితే..నేడు ఏదో జరిగిపోయిందని జనాలు నమ్మించే పచ్చరాతలు రాస్తే...జనం దేనితోనో నవ్వుతారని గుర్తెరగాలని ఆ వర్గం కానీ ఆచార్యులు...పచ్చపార్టీ బ్యాక్ చెందని విద్యార్ధులు సూచిస్తున్నారు. అవునంటారా కాదంటారా..!