సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఝలక్..


Ens Balu
6
Tadepalle
2021-07-26 13:33:29

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఝలక్ మామూలుగా లేదు. అక్టోబర్ నెలాఖరుకు మొదటి బ్యాచ్ ఉద్యోగులకు రెండేళ్ల ప్రొహిభిషన్ పూర్తవుతున్న సమయంలో ప్రభుత్వం పెట్టే డిపార్టమెంట్ టెస్ట్ పాసైతేనే అందరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రొహిభిషన్ సమయం రెండేళ్లూ మామూలుగా ఉండిపోయిన ప్రభుత్వం సరిగ్గా ఉద్యోగాలు రెగ్యులర్ అయి పేస్కేలు వర్తింపజేసే సమయంలో ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష పాసైతే తప్పా ఉద్యోగాలు రెగ్యులర్ కావని.. ఎంతకాలం ఆ పరీక్ష పాస్ కాకపోతే అంతవరకూ ప్రొభిషన్ సమయాన్ని పొడిగిస్తామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. దీనితో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు లక్షా 16 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఆలోచనలో పడింది. వాస్తవానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్ష విషయం ముందే చెబితే ప్రొహిభిషన్ రెండేళ్ల సమయంలో ఉద్యోగులు ఎప్పుడో పాసై ఉండేవారమి చెబుతున్నారు. కానీ అలా చెప్పకుండా సర్వీసు రెగ్యులర్ చేయడానికి 3నెలల సమయం వుందనగా ఈ విషయాన్ని ప్రకటించడం పట్ల ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రాష్ట్రప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ పేస్కేలు ఇస్తూ.. రెండేళ్ల ప్రొహిభిషన్ డిక్లేర్ చేస్తూ సర్వీసులు రెగ్యులర్ చేస్తుంది. ఆ సమయంలోనే ఎస్ఆర్ లు ఓపెన్ చేస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ,వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 16వేలకు పైగా ఉద్యోగులను 13 జిల్లాల్లో 15వేల 5 సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించింది. 

నియమించిన వెంటనే తూతూ మంత్రంగా ఒక నెల శిక్షణ ఇచ్చి వారందరినీ విధుల్లోకి తోసేసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో వసతులు లేకపోయినా, పూర్తిపేస్కేలు లేకపోయి వారంతా ఉద్యోగాలు రెండేళ్లు పూర్తిచేసుకోబోతున్నారు. నియామక సమయంలో ప్రకటించిన విధంగా కావాలనుకుంటే ఈ డిపార్ట్ మెంట్ పరీక్ష ఎప్పుడైనా పెట్టడానికి ఆస్కారం వుంటుంది. కానీ రెండేళ్ల పాటు కరోనో సమయంలో కనీసం సెలవులు కూడా రెండవ శనివారం, ఆదివారం  వినియోగించుకోకుండా..సచివాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్లు లేకపోయినా, సొంత కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఉపయోగించి మరీ ప్రభుత్వానికి సేవలందించారు సచివాలయ ఉద్యోగులు. తరువాత ఏడాదిలోనే ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లు ఇచ్చి ఆపై ఇంటర్నెట్ మరో 3నెలలు ఇవ్వకుండానే వీరితో సేవలు చేయించుకుంది ప్రభుత్వం. తామందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చాయనే ఆనందంతో వీరంతా ఎంతో కష్టపడి రాష్ట్రప్రభుత్వాని సేవలు అందిస్తూ ఎంతో పేరుతెచ్చారు. తీరా ఇపుడు రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం పెట్టే పరీక్ష పాసైతే తప్పా సర్వీసులను రెగ్యులర్ చేయమని, పాసయ్యేంత వరకూ ప్రొహిభిషన్ లో ఉంచుతామని ప్రకటించడం నిజంగా తమను ఇబ్బంది పెట్టడమేనని సచివాలయ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అటు ప్రభుత్వం కూడా ఒకేసారి లక్షా 16 వేల మందికి పేస్కేలు అమలు చేయాలంటే ఖజానాపై తీవ్రస్థాయిలో ఆర్ధిక భారం పడుతుందని భావించి రెండేళ్ల కాలంలో ఈ డిపార్ట్ మెంట్ పరీక్షప్రస్తావన తేకుండా.. ఇపుడు తేవడ సమంజసంగా లేదని ప్రభుత్వ ఉద్యోగులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఈ ప్రత్యేక పరీక్ష విషయం ఉద్యోగాల్లోకి చేరిన వెంటనే ప్రకటిస్తే రెండేళ్లలో ఉద్యోగులంతా ఆ పరీక్ష పాసయ్యేవారని.. అపుడు ప్రభుత్వం అనుకున్నట్టు ఒకేసారి అక్టోబరు 2నాటికి సర్వీసు రెగ్యులర్ చేయడానికి ఉండేదని చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో ఆది నుంచి జరుగుతున్న ప్రచారం తమ సర్వీసులు రెగ్యులర్ అవుతున్న తరుణంలో  ప్రభుత్వం అమలు చేయడం ఏమాత్రం ఆహ్వానించ దగినది కాదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, అభిమానం రెండూ ఖచ్చితంగా పోతాయని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలోనూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసినందుకు ఇదేనా ప్రభుత్వం తమని గుర్తించడమంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ప్రత్యేక డిపార్ట్ మెంట్ పరీక్ష నిబంధనను విరమించుకోవాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు.

 లేదంటే సర్వీసును రెగ్యులర్ చేసి తరువాత ఈ పరీక్షను పెట్టాలని, అపుడు నిబంధనలు విధిస్తే బాగుంటుంది తప్పా.. సర్వీసు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుందని ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లపాటు ప్రత్యేక నోటిఫికేషన్ అని చెప్పడంతో తమ పేస్కోలు కోల్పోయామని, అలాగని సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత తమకు రావాల్సిన రెండేళ్ల పేస్కేల్ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని కూడా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా, ఉద్యోగలకు వ్యతిరేకంగా చేయడం వలన రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల మద్దతు కూడా ఉండే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అందులోనూ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనే ఏకకాలంలో కాలంలో వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఇప్పటి వరకూ దేశంలోనే గొప్ప వ్యవస్థగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వానికి భంగపాటు తప్పదని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. లేదంటే జీతాల భారం తట్టుకోలేక, నిబంధన బూచీ చూపి ఖచ్చితంగా ప్రకటించిన డిపార్ట్ మెంట్ పరీక్ష నిబంధనకే కట్టుబడి అది పాసయ్యే వరకూ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకుండా ఉంటుందా అనేది వేచి చూడాలి..!