మీకు మెమో ఇస్తే నాకునేను ఇచ్చుకున్నట్టే..


Ens Balu
5
Tadepalle
2021-07-27 17:09:11

గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లాకలెక్టర్లు, జేసిలు తనిఖీలు చేసినట్టుగా రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు, ఐటిడిఏ పీఓ చేయకపోవడం బాధాకరం.. మనం తరచుగా తనిఖీలు చేస్తేనే అక్కడ ప్రజలకు సేవలు బాగా అందుతాయి..పనిచేయని ఏ అధికారికైనా మెమో ఇవ్వండి..అలా మెమో ఇవ్వడమంటే నాకు నేను ఇచ్చుకున్నట్టేనని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల మంత్రులు, రాష్ట్ర శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాలకు, ఆర్బీకెలకు  వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్‌ఓపీ పాటిస్తున్నారా?లేదా?చూడాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ ప్రజలకు అందుబాటులో ఉండి వారినుంచి విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కారాలు చూపాలన్నారు. ఖచ్చితంగా బయో మెట్రిక్ అమలు చేస్తూ రోజుకి రెండుసార్లు సిబ్బంది హాజరు నమోదు కావాలన్నారు. కరో సమయంలో రాష్ట్రవ్యాప్తం సిబ్బందిగా బాగా కష్టపడి పనిచేశారన్నారు.  నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్‌ దుకాణాలపై దృష్టి పెట్టాలి:
అలాంటి వాటిపై కలెక్టర్లు, ఎస్పీలు కలిసి.. సంయుక్తంగా దాడులు నిర్వహించాలని అప్పుడే కల్తీలు ఆగుతాయని సీఎం పేర్కొన్నారు. విధి నిర్వహణలో వున్న సిబ్బంది, ఏ స్థాయి అధికారపై అయినా చర్యలు చేపట్టాల్సిందేనంటూ అధికారులను ఆదేశించారు.  ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్టేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.